నటుడు పోసాని కృష్ణమురళి గురించి అందరికి తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా అయన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కామెడీ పాత్ర అయినా, సెంటిమెంటల్ పాత్ర అయినా తనదైన స్టైల్ లో చేసి అందరిని అలరిస్తుంటారు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో పరుచూరి బ్రదర్స్ వద్ద రచయితగా పనిచేసి ఆ తర్వాత మంచి మంచి సినిమాలకు రచయితగా పనిచేసి తనదైన మార్కుతో ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా గుర్తింపు పొందాడు. గోకులంలో సీత, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య లాంటి చాలా హిట్ సినిమాలకు పని చేశారు పోసాని..
రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా అయన చాలా సినిమాలకు పనిచేశారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కాగా ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి అవార్డులు కూడా దక్కాయి. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో చేసిన కామెడీ పాత్రలకు మంచి ప్రశంశలు దక్కాయి.
ఇకపోతే ఇండస్ట్రీ జనాలకు పోసాని వ్యక్తిగత విషయాలగురించి తెలిసిందే చాలా తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి గురించి చాల తక్కువ తెలుసు.. పోసాని గారి తో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు ఆయన పేరు ప్రజ్వల్.లాస్ ఏంజిల్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కోచింగ్ తీసుకుని వచ్చాక ఇంట్లోనే కూర్చుని స్టోరీ రాసుకుంటున్న ప్రజ్వల్ నీ చూసి పోసాని గారు కొరటాల శివ దగ్గర జాయిన్ అవమని చెప్పారు దాంతో ప్రజ్వల్ కొరటాల శివ దగ్గర భరత్ అనే నేను సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ప్రజ్వల్ కి హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.ప్రజ్వల్ మంత్రిగారు మాటిచ్చారు అనే ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు అయితే ప్రజ్వల్ పోసాని గారిలాగా రైటర్ గా, డైరెక్టర్ గా రాణిస్తాడో లేదో చూడాలి.



























