పోసాని పేరు చెబితే చాలు.. వెండితెర ఉలిక్కిపడుతుంది. బుల్లితెర చన్నబోతుంది. సినీ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్టుగా పోసాని కృష్టమురళి ఇలా తన దైనందిన జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించడమే కాకుండా తనదైన సొంత శైలిలో ఎంతో మంది అభిమానుల హృదయాలలో ఓ సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ 2 ఫేస్ మాట్లాడే పోసానిని చూసి.. ఎవరైనా సరే భయపడాల్సిందే. ఫైర్ బ్రాండ్ యాక్టర్గా, ఫిల్మ్ మేకర్గా ముఖానికి రంగు వేసుకోకుండా ఎప్పుడూ నిజాలనే మాట్లాడుతారు అది ఆయన నైజం. తాజాగా ఆయనిచ్చిన ఒక ఇంటర్వ్యూలో బతుకు జట్కా బండి కార్యక్రమంలో జరిగిన కొన్ని వివాదస్పదమైన విషయాలపై స్పందిస్తూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. వాటిల్లో ముఖ్యమైనవి తెలుగుడేస్క్ పాఠకుల కోసం..
నాకు సినిమా రంగం ఎంత ఇష్టమో.. టెలివిజన్ రంగమన్నా అంతే ఇష్టం. యాంకర్ సుమ చేసే షోలంటే ఇంకా ఇష్టం. ఆమె తన షోలకు పిలుస్తే వెళ్తుంటాను. అలాగే జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొన్నాను. అలాగే రోజా హోస్ట్గా ఉండే బతుకు జట్కా బండి షోలో కూడా పాల్గొన్నాను. ఒక సంవత్సరం కాంట్రాక్టు పూర్తి కావడంతో ఇప్పుడు ఆ షోలో పాల్గొనడం మానేశాను అని అన్నారు. బతుకు జట్కా బండిలో జరిగిన కొన్ని వివాదస్పదమైన అంశాలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి కొన్ని విమర్శలు నా వరకు వచ్చాయి. అందులో పాల్గొనే వారిని నవ్వమని, ఏడ్వమని బలవంతం చేస్తారు. వారిని కొడతారనే వివాదాస్పద అంశాలు నేను ఆ షోలో ఉన్నప్పుడు జరగలేదు. నేను ఇలాంటి వాటికి వ్యతిరేకమని ముందే చెప్పాను. బతుకు జట్కా బండి కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ముందే నేను ఏమి ఆశిస్తున్నానో అదే విషయాన్ని వారి ముఖం మీదే చెప్పాను. స్టేజ్ అంతా నాకు అప్పగించాలని.. మిగితా విషయాలు నేను చూసుకొంటానని చెప్పేశాను. జెన్యూన్ పర్సన్స్ అయితేనే బాధితులకు సపోర్ట్ చేస్తాను.
ఫలానా అమ్మాయికి సపోర్ట్ చేయమని అడిగితే నో చెప్పేవాడిని. నేను ఉన్నంత కాలం అలాంటివి జరుగలేదు. ఆ తర్వాత ఆ షోలో ఏం జరిగిందో నేను చెప్పలేను అని పోసాని అన్నారు. బతుకు జట్కా బండి ప్రొగ్రాంలో కొందరిని సపోర్ట్ చేయమని అడిగితే ఒప్పుకొనే వాడిని కాదు. అలాగని ఎవరూ ఎక్కువగా నన్ను ఫోర్స్ చేసేవారు కాదు. నేను ఆ షోలో ఉన్నంత కాలం ఎవరిని కొట్టిన దాఖలాలు లేవు. కొట్టించుకొనే సందర్భాలు కూడా లేవు. ఆ షోలో చాలా కుటుంబాలను కలిపాం. దాదాపు 90 శాతం విజయవంతమయ్యాయి. బయటకు వెళ్లిన తర్వాత 1,2 కేసులు ఫెయిలయ్యాయి అని పోసాని తెలిపారు.
బతుకు జట్కా బండి షోలో పాల్గొన్న వారి పిల్లలను చదివించేందుకు కొందరికి ఆర్ధిక సహాయం చేశాను. డబ్బులు లేని సమయంలో సహాయం చేయడం కుదరలేదు అని పోసాని వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూను ముగిస్తూ చివరగా “నాకు వెకిలి చేష్టలు రావు. హింసించే 23వ రాజు పులకేశి లాగ నేనెవర్నీ హింసించను. సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని కెలకను.. ఎవరు నన్ను కెలకరు” అని పోసాని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.😀😀
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.