Postpartum Weight Loss:తల్లి కావాలి అనేది ప్రతి మహిళ కల. గర్భధారణ దాల్చినప్పటి నుండి ఆరోగ్యం కోసం శరీరానికి అవసరమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటారు. దీని వల్ల వారి శరీర బరువు పెరుగుతుంది. అయితే ఆ పెరిగిన బరువు కొంతమందిలో డెలివరీ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.
డెలివరీ అయిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సాధారణ ప్రసవం అయిన తర్వాత మహిళలకు శక్తి కోసం నెయ్యితో చేసిన లడ్డూలు కూడా పెట్టడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితులలో వారు వారి నార్మల్ బాడీ వెయిట్ కి రావడం అంత సులువు కాదు. సిజెరియన్ అయిన మహిళల్లో పొట్ట వెలాడటం వంటివి చూస్తుంటాం. దీని వల్ల వారు మనస్తాపం చెందుతుంటారు. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా మహిళలు వారి శరీర బరువును తగ్గించుకోవచ్చు, దానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటికోసం కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరి….
డెలివరీ తర్వాత కొన్ని నెలల వరకు వ్యాయామాలు చేయకూడదు అని డాక్టర్లు సలహా ఇస్తుంటారు, సిజేరియన్ అయిన వారికి ఇంకా జాగ్రత్త అవసరం. అయితే వాకింగ్ చేయవచ్చును. ఉదయం, రాత్రి వేళ తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
పిల్లలకి తల్లి పాలు శ్రేయస్కరం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య చాలా మంది వారి అందం తగ్గుతుంది అని బ్రెస్ట్ ఫీడ్ చేయడం లేదు. ఇలా ఆలోచించడం చాలా తప్పు. పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పాలు ఇవ్వడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది అని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి, గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగాలి. దీనిని వాము నీరు అని అంటారు. ఇది మీ బరువుని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాక గ్యాస్, అజీర్తి సమస్యలు ఉన్న కూడా ఇది మంచి ఔషధం లాగా పని చేస్తుంది. దీనిని కనీసం రెండు పూటలా తాగాలి, లేదా రోజంతా అయిన తాగవచ్చు.
జాజికాయ పాలు శరీర బరువును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక కప్పు పాలలో పావు టీ స్పూన్ జాజికాయ పొడిని కలిపి వేడి చేసి, గోరు వెచ్చగా తాగాలి. ఇవే కాకుండా మీరు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…