Connect with us

Featured

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ !! ఏమాటకామాటే లుక్ అదుర్స్ బాసు..!!

Published

on

పవర్ స్టార్..ఈ పేరు చెబితే చాలు పవన్ కల్యాణ్ ఫాన్స్ లో ఓ వైబ్రేషన్. ఈ పేరే కాదు ఆయన ఫొటో చూసినా, ఆయన కటౌట్ కనిపించినా ఆ కిక్కే వేరు. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. పవన్ ఫాన్స్ ను ఆపడం ఎవరితరం కాదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కు కేవలం ఫాన్స్ మాత్రమే కాాదు. భక్తులు కూడా ఉన్నారు. వారు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు.

వాస్తవానికి టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఆయన చూపించిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే, రాజకీయాల్లోకి వెళ్లి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలలో నటిస్తున్నా ఆయన సినీ ఇమేజ్‌కు, మార్కెట్‌కు ఏ మాత్రం డోకా లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పాత ఫొటోలు ఏవి బయటికి వచ్చినా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్​ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ​కు చెందిన ఓ పాత ఫొటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. ఈ ఫొటోలో యంగ్ పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. అప్పుడప్పుడే వస్తోన్న మీసం, గెడ్డం.. చందమామలాంటి ఆ ముఖం వాహ్ సూపర్.. ముఖ్యంగా ఆ కళ్లు ఉన్నాయి చూసారూ.. ఆ లుక్స్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే..!

లేటెస్టుగా బయటికొచ్చిన ఈ ఫొటోను మీమ్స్ క్రియేటర్స్ విపరీతంగా వాడేస్తూ.. రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. వాటిని చూసి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక పవన్ సినీ కెరీర్ విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ ల సినిమాలలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ “వకీల్ సాబ్” కోసం పవన్ కళ్యాణ్ నవంబర్ నుండి షూట్ కి రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి షూట్ చేయనున్నారట. ఈ షూట్ తో సినిమా పుర్తవుతుందని.. అన్ని కుదిరితే వెంటనే రిలీజ్ కూడా ప్లాన్ చేస్తారట.

అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా తగ్గేవరకూ సినిమాల షూటింగ్ కి దూరంగా ఉండటమే మంచిదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మిగిలిన హీరోలు షూట్ కి రెడీ అవుతుండటంతో.. పవన్ వకీల్ సాబ్ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తోన్న సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నారని.. ఈ ఏడాది చివరి వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని ఇప్పటికే పవన్ కళ్యాణ్, క్రిష్ కి చెప్పినట్లు తెలుస్తోంది

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!