రోడ్డు ప్రమాదాలు సీనీ కుటుంబసభ్యులను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరిగి ఆపుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడగా.. ప్రస్తుతం ఇప్పుడు రెబల్ స్టార్ కృష్ణం రాజుకి ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
వివరాలల్లోకి.. వెళితే సోమవారం సాయంత్రం తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు ఆయన తుంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని.. అంతా ఫేక్ అంటూ వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. తర్వలోనే అతడు లండన్ కు వెళ్తున్నారని.. హెల్త్ చెకప్ కోసం అపోలో ఆసుపత్రిలో అతడు చేరినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరో వాదన కూడా వినిపిస్తుంది. అదేంటంటే.. అతడు న్యూమోనియాతో బాధపడుతుండగా.. ఆయనకు అపోలోలో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం రెబల్ స్టార్ కృష్ణం రాజు రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో ఫేక్ వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మోద్దో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని కారణాల వల్ల సీని ప్రముఖులు కనిపించకపోతే.. అతడు చనిపోయినట్లు కూడా వార్తలు రాశారు. అతడు స్పందించి నేను బతికే ఉన్నాను అని చెప్పే పరిస్థితికి వచ్చింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…