Prabhas Sreenu : ప్రభాస్ శ్రీను, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి అభిమానులకు దగ్గర అయ్యాడు. ప్రభాస్ శ్రీను ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలలో నటించాడు. హీరో ప్రభాస్ తో ఉన్న స్నేహం కారణంగానే ఈయనకు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ శ్రీను అన్న పేరు వచ్చింది. ఈయన తాజాగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించాడు. తెలుగు సినిమాలలో అగ్రహీరోలు అందరితోను నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను తన కెరీర్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ చూపించే ప్రేమకు హద్దులు ఉండవు…
ప్రభాస్ శ్రీను యామదొంగ, ఊసరవెల్లి, బృందావనం, కంత్రి మొదలైన సినిమాలలో ఎన్టీఆర్ తో కలసి నటించారు. అయితే ఎన్టీఆర్ తో మీ సినీ ప్రయాణం ఎలాగా ఉంటుంది అని అడుగగా… ఆయనతో సినిమాలు చేసేటప్పుడు ముందు మాతో ఉండేది ఫుడ్. ఆయన చూపించే ప్రేమకి అసలు హద్దులు ఉండవు. ఈగో ఏమి పెట్టుకోకుండా ప్రేమ చూపిస్తాడు. ఆయనతో సినిమా మొదలు అయ్యింది అంటే ఉదయం నుండి రాత్రి వరకు అయనతోనే ఉంటాము అందరం. షూటింగ్ మార్చాలి అన్నా కూడా ఆయనే డ్రైవ్ చేస్తారు మమ్మల్ని పక్కన కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.

‘బృందావనం’ షూటింగ్ సమయంలో తమిళ్ హీరో ప్రభు ఇంటినుండి నా సైజులో ఉన్న కారియర్ వచ్చింది. చూసి ఇది సెట్ అందరికీనా అని అడిగాను, గొప్పోడివే అది మనకే అన్నారు. ఆయనతో పర్సనల్ లైఫ్ వేరే లెవెల్ లో ఉంటుంది. బృందావనం సమయంలో నా భార్యకు అబార్షన్ అయితే చాలా డిప్రెస్ అయ్యాను. అపుడు నాకు ఆయన ఫోన్ చేసి ఎమ్ కాదు నెక్స్ట్ ఎన్టీఆర్ లాంటోడు పుడతాడు చూడు అని, ఎటైనా వెళ్ళండి ఊటీ అలా చేంజ్ గా ఉంటుంది. ప్యాకేజీ చూసి టికెట్స్ పంపిస్తాను అని చెప్పారు. అంత బిజీ హీరో నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేశారు, అది నాకు ఎప్పుడూ గుర్తుండి పోతుంది అని చెప్పుకొచ్చారు.































