ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా కష్ట సమయాల్లో ప్రతి ఒక్కరూఆర్థిక భద్రత కోసం వివిధ రకాల బీమా పథకాలలో పాలసీలను పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా బీమా పాలసీ పొందేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది.మే 9, 2015 న ‘ప్రధానమంత్రి జీవిత బీమా పథకం’ప్రవేశపెట్టింది. ఈ బీమా పథకంలో చేరే పాలసీదారులకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

ప్రధానమంత్రి జీవిత బీమా పథకం కింద పాలసీదారు ఖాతా నుంచి ప్రతి సంవత్సరం రూ.330 కట్ అవుతుంది. ఈక్రమంలోనే పాలసీదారుడు ఏదైనా ప్రమాదం సంభవించి మరణించిన అతనికి నామినీగా వ్యక్తులకు 2 లక్షల రూపాయలు లబ్ధి కలుగుతుంది. ఈ పథకంలో 18 నుంచి 50 సంవత్సరాలు వయసు కలిగిన వారు అర్హులు.
ప్రధానమంత్రి జీవిత బీమా పథకంలో చేరాలనుకునే వారు ముందుగా బ్యాంకుకి వెళ్లి వారి బ్యాంకు ఖాతా నుంచి ప్రతి ఏడాది ప్రీమియం ఆటోమెటిక్గా చెల్లింపు జరిగేలా ఆటోడెబిట్కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా పాలసీదారుడు ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ అభ్యర్థికి నామినిగా ఉన్న వ్యక్తి బ్యాంక్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ను సంప్రదించాలి. ఫారమ్ నింపడం ద్వారా మీరు డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.
నామిని ఫారమ్ లో కచ్చితంగా మీ పేరు ఫోన్ నెంబర్ మరియు మీకు సంబంధించిన ఇతర విషయాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగా క్లెయిమ్ పరిష్కరించబడిన తర్వాత 2 లక్షలు నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రధానమంత్రి జీవన బీమా పథకంలో పాలసీదారుగా నమోదు చేసుకోండి.

































