Prakash Raj: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే నటించారు.చాలా సంవత్సరాలు తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా భేషరమ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో దీపిక పదుకొనే భారీగా ఎక్స్పోజ్ చేయడంతో ఈమె వస్త్రధారణ పట్ల ఎంతోమంది విమర్శలు చేశారు. దీంతో ఈ పాట కాస్త వివాదంలో చిక్కుకుంది.
ఇప్పటికే పలువురుసినీ రాజకీయ ప్రముఖులు ఈ పాటపై విమర్శలు కురిపించారు. తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి చిత్ర బృందానికి వార్నింగ్ ఇస్తూ.. డర్టీ మైండ్ సెట్ తో ఈ పాటను చిత్రీకరించారని తప్పులు సరిద్దుకోకపోతే సినిమాను విడుదల చేయనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Prakash Raj: కాషాయం ముసుగులో అత్యాచారం చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నారు…
ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ ఇష్యూ పై స్పందించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రకాష్ రాజు మాట్లాడుతూ బ్రోకర్ ఎమ్మెల్యేలు కాషాయపు ముసుగులో స్వామీజీలు మైనర్ బాలికల పై అత్యాచారాలు చేసిన వివాదాలు ఉండవు. అలాంటివారు పబ్లిక్ లో తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ దీపికా పదుకొనే ధరించిన కాస్ట్యూమ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని ఈయన చేసిన ఈ కామెంట్స్ సినీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.




























