Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈమధ్య కాలంలో ఎక్కడ మీడియా సమావేశాలలో పాల్గొంటే అక్కడ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏ విషయమైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఇదివరకే ఈయన ఎన్నో మార్లు ఇలాంటి వివాదాలలో చిక్కుకోగా తాజాగా మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.
తాజాగా ప్రకాష్ రాజ్ కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా బ్యాన్ చేయాలని ట్రోల్ చేసిన వారిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలన్న ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడా సినిమా రూ. 700 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది.
మోదీ సినిమాకు కనీసం రూ.30 కోట్లు కూడా వసూలు రాబట్టలేకపోయారు. అలాంటివారు కేవలం మొరుగుతారంతే, కరవరు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ అని వ్యాఖ్యానించారు. ఇక గత ఏడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ తనకు ఆస్కార్ రావాలని అడుగుతున్నారు కానీ తనకు భాస్కర్ అవార్డు కూడా రాదని ఈయన ఎద్దేవా చేశారు.
రీసెంట్గా వచ్చినటువంటి చెత్త సినిమాలు ఏదైనా ఉంది అంటే అది ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ జ్యూరీనే మూవీ మేకర్స్ పై ఉమ్మేసింది. పైగా తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నారు కానీ ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదంటూ ఈ సినిమా గురించి కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై ది కాశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…