Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈమధ్య కాలంలో ఎక్కడ మీడియా సమావేశాలలో పాల్గొంటే అక్కడ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏ విషయమైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఇదివరకే ఈయన ఎన్నో మార్లు ఇలాంటి వివాదాలలో చిక్కుకోగా తాజాగా మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.
తాజాగా ప్రకాష్ రాజ్ కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా బ్యాన్ చేయాలని ట్రోల్ చేసిన వారిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలన్న ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడా సినిమా రూ. 700 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది.
మోదీ సినిమాకు కనీసం రూ.30 కోట్లు కూడా వసూలు రాబట్టలేకపోయారు. అలాంటివారు కేవలం మొరుగుతారంతే, కరవరు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ అని వ్యాఖ్యానించారు. ఇక గత ఏడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ తనకు ఆస్కార్ రావాలని అడుగుతున్నారు కానీ తనకు భాస్కర్ అవార్డు కూడా రాదని ఈయన ఎద్దేవా చేశారు.
రీసెంట్గా వచ్చినటువంటి చెత్త సినిమాలు ఏదైనా ఉంది అంటే అది ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ జ్యూరీనే మూవీ మేకర్స్ పై ఉమ్మేసింది. పైగా తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నారు కానీ ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదంటూ ఈ సినిమా గురించి కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై ది కాశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…