Featured

రూ.210 కోట్లు చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన నిర్మాత అశ్వనీదత్ !

అమరావతిలో జరిగిన భూ సమీకరణ అంశంలో జగన్ ప్రభుత్వంపై మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు, నిర్మాత అశ్వనీదత్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దెందుకు చుట్టుపక్క భూములను తీసుకుంది. వాటికీ బదులుగా అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అలాగే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చింది, అయితే ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో రాజధాని మార్పుకోసం సన్నాహాలు చేస్తుంది. 3 రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దింతో అమరావతి ప్రాంతంలో వీరికి కేటాయించిన భూమి విలువ పూర్తిగా తగ్గిపోయింది.

దీంతో 31 ఎకరాలు విమానాశ్రయానికి ఇచ్చిన కృష్ణం రాజు, 39 ఎకరాలు ఇచ్చిన అశ్వినీదత్ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. తనకు 210 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఫిటిషన్ లో పేర్కొన్నారు. వీళ్లిద్దరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు… కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన 3 రాజధానుల ప్రతిపాదనను సినీ నటుడు చిరంజీవి స్వాగతించడాన్ని సినీ నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… “3 రాజధానుల విషయంలో చిరంజీవి చేసిన కామెంట్స్ ను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, చిరంజీవికి ఏం తెలుసని 3 రాజధానులు బాగుంటుందని చెప్పారని, ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం ఆయనకు తెలియదా.? పవన్‌కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా.? జగన్ వాళ్ల నాన్న చేసిన దాంట్లో 10 శాతం చేసినా గొప్ప సీఎం అవుతారని, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారని, నటుడిగా కాకున్నా.. సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా అని అశ్వనీదత్ పరోక్షంగా కామెంట్స్ చేశారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిస్తే ప్రతిఫలంగా రాజధానిలో భూములిచ్చారని.. ఎయిర్‌ పోర్ట్ విస్తరించారని.. ఆ భూములను ఎలా తిరిగిస్తారని అశ్వనీదత్ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని అశ్వనీదత్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ రాజధానిలో నెలకొన్న పరిణామాలపై అశ్వనీదత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని చెప్పారు. గ్రామాల్లో ఉన్నది పోలీసులు కాదని, పోలీసు డ్రెస్‌లో ఉన్న గూండాలని ఆయన మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు బహుమానంగా ఒక్కో ఇంటికి 10 మంది పోలీసులను పెట్టారా అని ప్రశ్నించారు. మహిళలపై లాఠీచార్జ్ చేశారని.. ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ సవాంగ్ తన మిత్రుడని, ఆయన హయాంలో ఇలా జరగడం దురదృష్టకరమని అశ్వనీదత్ కామెంట్ చేశారు

telugudesk

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

5 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

6 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

6 hours ago