Puri Jagannath : పూరీ జగన్నాథ్ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి కరణ్ జోహార్ సహాయంతో నిర్మాత గా తీసిన చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడిగా అనన్య పాండే నటించింది. ఇక రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఆగష్టు 25 న విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచింది. ఇక సినిమా ఈవెంట్ ను వరంగల్ సత్యసాయి కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి పూరీ, ఛార్మి, విజయ్ దేవరకొండ, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. సినిమా గురించి మాట్లాడుతూ పూరీ ఆసక్తికర వాఖ్యలు చేసారు.

కరణ్ కింగ్ ఆఫ్ బాలీవుడ్…
లైగర్ సినిమా నిర్మాణంలో సహకరించిన కరణ్ జోహార్ కు కృతజ్ఞతలు తెలిపిన పూరీ జగన్నాథ్, నేను కలిసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి కరణ్ జోహార్. అయన చాలా సింపుల్ గా ఉంటూ తన జీవితాన్ని రాజులాగా అస్వాదిస్తున్నాడు అంటూ పూరీ కామెంట్స్ చేసారు. ఇక లైగర్ సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతున్న సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గోల చేయడంతో విజయ్ గురించి పూరీ మాట్లాడాడు.
నా భార్య ఆ సినిమా చూడమని చెప్పి మారమంది…

విజయ్ దేవరకొండా గురించి మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు. పూరీ మాట్లాడుతూ నా భార్య నేను ఫెయిల్యూర్ లో ఉన్న సమయంలో కొత్త డైరెక్టర్లను చూసి నేర్చుకో ఒకసారి కొత్త సినిమాలు చూడు అని చెప్పింది. ఏ సినిమా చూడాలి అనుకున్నపుడు సందీప్ వంగ, అర్జున్ రెడ్డి సినిమా చూపించింది. ఆ సినిమా చూస్తూ మధ్యలో ఆపేసాను. సినిమా బాగుంది డైరెక్షన్ బాగుంది కానీ నేను విజయ్ దగ్గరే ఆగిపోయాను. అప్పుడు అనుకున్నాను విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ, తన లాంటి హీరోని చూడలేదు. సినిమా చేద్దామని కోటి రూపాయలు పంపితే సినిమా అవసరాలకు ఉంటాయని తిప్పి పంపాడు. ఇక సినిమా నిర్మాణ సమయంలో తనకు రెండు కోట్లు ఇస్తే అప్పులు ఉన్నాయి కదా అవి ముందు క్లియర్ చేయండి అని తిరిగి వెనక్కి పంపాడు. ఈ కాలం లో ఇలాంటి హీరోని నేను చూడలేదు అంటూ విజయ్ దేవరకొండను ప్రశంసిచారు పూరీ జగన్నాథ్. ఇక విజయ్ కూడా లైగర్ సినిమాకు పూరీ ఛార్మి తల్లి తండ్రులు అంటూ మాట్లాడాడు.

































