Puri Jagannath : పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు.
అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో… పూరి, రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనేక తెలుగు చిత్రాలకు ప్రధానంగా యాక్షన్ జానర్లో పనిచేశారు. ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియురాలితో ఒక పందెం కాస్తాడు అనే కాన్సెప్టుతో పూరి జగన్నాథ్ ఒక కథ రాసుకున్నాడు. శివ ఆ తదుపరి చిత్రాలు నాగార్జునతో రాంగోపాల్ వర్మ రూపొందించారు. కావున నాగార్జునతో కొంత పరిచయం ఉండటం వలన ఆ కథను అమలకు వినిపించారు. ఎందుకనో ఈ కథ పట్ల ఆమె అంతగా ఆసక్తి చూప లేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాలని పూరి అనుకున్నారు.
ఓ నవలా రచయిత ఈ కథను చదివి.. నా పేరుతో నవల పబ్లిష్ చేయిస్తాను. అవసరమైతే నీకు పదివేల రూపాయలు కూడా ఇస్తానన్నారు. దానికి దర్శకుడు పూరి నవలగా కొన్ని పేజీలతో కథను రాశారు. పూరి తన మనసులో ఏ మూలనో అలా చేయడం నచ్చలేదు. తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలవాలి ఎలా? పార్టీలలో కలుద్దాం అంటే పవన్ పార్టీలకు హాజరుకాడు. పోనీ సినిమా ఫంక్షన్ లో కలుద్దామా? అంటే అక్కడికి కూడా ఆయనరారు. పోనీ షూటింగ్స్ లో కలుద్దాం అంటే అవుటర్స్ ఆర్ నాట్ ఆలవుడ్. అప్పటికి తొలిప్రేమ షూటింగ్ లో కలుద్దామని ప్రయత్నించారు. అలా 6నెలలు గడిచి పోయింది. అయినా పూరి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. కళ్యాణ్ బంధువుతో మళ్ళీ ప్రయత్నించాడు కానీ తిరుగు ముఖం పట్టాడు.
శ్యామ్ కె.నాయుడు పరిచయం ఉండడం వలన ఆయన సోదరుడు కెమెరామెన్ చోటా కె.నాయుడుని వెళ్లి కలిశాడు. ముందు ఆ కథేంటో తనకు చెప్పాలని అప్పుడే పవన్ కళ్యాణ్ తో కల్పిస్తానని ఆయన చెప్పారు. పూరి ఇదివరకే రాసుకున్న “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” కథను చెప్పడం జరిగింది. ఆ కథ చోటా కె.నాయుడుకి నచ్చడంతో 1999 ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటలకు పవన్ కళ్యాణ్ తో స్టోరీ సిట్టింగ్స్ లో చోటా కె.నాయుడు, పూరి జగన్నాథ్, కూర్చున్నారు. కానీ పూరి మాత్రం బద్రి స్టోరీ చెప్పారు. చోటా కె నాయుడు ఆశ్చర్యంగా చూశారు. అవును బద్రి సినిమా స్టోరీ గనుక చెప్పుంటే మీకు నచ్చుండేది కాదు. తర్వాత నాకు పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ ఉండేది కాదని చోటా కె.నాయుడుతో పూరి అన్నారు. అందుకే మీకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాను క్షమించండని అన్నారు.
స్టొరీ బాగుంది కానీ క్లైమాక్స్ నాకు నచ్చలేదు దీన్ని మార్చి తీసుకొని రండని పవన్ కళ్యాణ్, పూరితో అన్నారు. స్టోరీ నచ్చినందుకు సంతోషపడాలో క్లైమాక్స్ మార్చి తీసుకురమ్మన్నందుకు బాధ పడాలో అర్థం కాలేదు. తిరిగి ఇంటికి వెళ్లి క్లైమాక్స్ మీద పూరీ కసరత్తు చేశారు. కానీ ఆ స్టోరీ క్లైమాక్స్ ఒక్కటి కూడా పూరికి నచ్చలేదు. నిర్మొహమాటంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి స్టోరీ క్లైమాక్స్ ఏడు రాశాను సార్ కానీ పాతదే బావుందని డైరెక్టుగా చెప్పేశాడు. అందుకు పవన్ కళ్యాణ్ స్టోరీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తెలుసుకోవడానికి క్లైమాక్స్ మార్చమని చెప్పాను. కానీ మీరు మార్చకుండా తీసుకువచ్చారు అది నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్ అంటూ పూరి జగన్నాద్ భుజాన్ని తట్టారు.
వెంటనే నిర్మాత త్రివిక్రమ రావు కి ఫోన్ చేసి స్పాట్ కి రమ్మన్నారు. త్రివిక్రమరావు వెంటనే అక్కడికి చేరుకున్నారు.. మనం తీయబోయే సినిమాకి ఈయనే దర్శకుడు అని పూరి జగన్నాథ్ కి త్రివిక్రమరావుని కళ్యాణ్ పరిచయం చేయించారు. సినిమాకి సంబంధించిన మిగతా విషయాలన్నీ మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. పూరికి 50000రూ.లు అడ్వాన్స్ త్రివిక్రమరావు ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకొని పూరి జగన్నాథ్ చాలా సంతోషపడ్డారు. ఫిలింనగర్ టర్నింగ్ లో మూడు లక్షలు రూ.లు అప్పు చేసి ఆఫీస్ తీసుకుని డెకరేట్ చేశారు.
సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో చలో ముంబై అంటూ వెళ్లి కో-డైరెక్టర్ సహాయంతో మెయిన్ హీరోయిన్ గా రేణుదేశాయ్, రెండో హీరోయిన్ గా అమీషా పటేల్ ని బుక్ చేశారు. ముందు ఈ సినిమాకి “చెలి” అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ మరీ సింపుల్ గా ఉంటుందని “బద్రి” అని టైటిల్ చివరికి నిర్ణయించారు. అలా 2000 ఏప్రిల్ 20న “బద్రి” సినిమా విడుదలైంది. మొదట డివైడ్ టాక్ వచ్చింది. నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.