R.K.Roja: వైసీపీ మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఓ వెలుగు వెలిగిన రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.

ఇక వైసిపి పార్టీ తరఫున 2014 ,19 ఎన్నికలలో నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఈమెకు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పదవి కూడా లభించింది. అయితే మంత్రిగా ఈమెకు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో 2024 ఎన్నికలలో పూర్తిగా ఓటమిపాలు అయ్యారు.
ఈ విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటమిపాలు కావటంతో రోజా కూడా రాజకీయాల పరంగా ఏమాత్రం యాక్టివ్ లేరని తెలుస్తుంది. పార్టీ కార్య కలాపాలకుదూరంగా ఉంటున్నటువంటి ఈమె ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు షోలలో సందడి చేస్తున్న రోజా తిరిగి వెండితెరపైకి రావడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ విధంగా రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఆసక్తి తగ్గించిన ఈమె ఇండస్ట్రీపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ రోజా ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత ప్రభుత్వ హయామంలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం మాత్రం రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడటం కూడా లేదు మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రోజా కూడా రాజకీయాల పరంగా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.





























