Rajesh Appasani : ఆంధ్రప్రదేశ్ రాష్టం రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఏకైక చర్చ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన. పర్యటన అనంతరం మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం పలు అంశాలను చర్చించడం తో ఇప్పుడు అసలు వారి మధ్య ఏ ఇష్యూ గురించి చర్చ నడిచింది. వైసీపీ పట్ల బీజేపీ వైఖరి ఏంటి అలాగే జనసేనాని బీజేపీతో కలిసి నడుస్తారా అనే అంశాలు చర్చకు వచ్చాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక కొంతమంది భేటీకి పవన్ ను పిలిచి ప్రధానమంత్రి అవమానించారు అంటూ మాట్లాడుతున్నారు కానీ నిజానికి అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయంలో ఎవరికీ తెలియదు. ఇక ఈ ఇష్యూల అన్నింటి మీద పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని విశ్లేషించారు.
వారి మధ్య జరిగిన సంభాషణ అదే….

ప్రధాన మంత్రి తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కామెంట్స్ చేసారు. అంతకుమించి ఏం మాటాడరో వివరించలేదు. ఇక దీనిపై రాజేష్ అప్పసాని మాట్లాడుతూ పవన్ బీజేపి మధ్య జరిగిన భేటీలో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడులు అలాగే వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించిన చర్చ జరుగుంటుంది. విషయాలన్నీ బయటికి రాకుండా గోప్యంగా ఉండవచ్చు కానీ భేటీలో ఇవన్నీ చర్చించి ఉంటారు అంటూ మాట్లాడారు.

ఇక జగన్ ను లొంగదీసుకున్నట్లు పవన్ ను లొంగదీసుకునే అవకాశం లేదు. ఎంతసేపు పవన్ పార్టీ నచ్చి బిజేపి కలిసి ప్రయాణించాల్సిందే అధికాక మోడీ కి వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ తో కలిసి లోకల్ బిజేపి నాయకత్వం సమన్వయం తో కలిసి పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయాల మీదే చర్చ జరిగినట్లు కనిపిస్తోంది అంటూ రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు. పవన్ భేటీ అనంతరం మంచిరోజులు రాబోతున్నాయి అంటూ అనడం ఒకరకంగా వైసీపీ పాలన నుండి ఏపీ కి విముక్తి అనే అర్థం అన్ని విడమరచి చెప్పకపోయినా వాటి అర్థం అలానే ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.




























