Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ… ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వివాదాలే. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే వివాదాలతోనే తనకు కావలసిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఆర్జీవి తరువాత బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి శివ, క్షణక్షణం, రంగీలా, భూత్, కంపెనీ, సత్య వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆర్జీవి తీసే సినిమాలు అప్పట్లో తీసిన సినిమాల లాగా ఉండవు అన్న వాదన కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షణక్షణం సినిమా గురించిన కబుర్లు చెప్పారు.

ఒకడు బూతులు తిట్టాడు…
క్షణక్షణం సినిమా విషయంలో మొదటి సారి చాలా బాధపడ్డాను అంటూ తెలిపారు. ఫెయిల్యూర్ ను తీసుకోలేక కొంత ఇబ్బంది పడ్డానని అయితే అది ఎక్కువ సేపు కాదంటూ తెలిపారు. ఆ సినిమా థియేటర్ కి వచ్చాక విజయవాడలో ఒక థియేటర్ లో రెస్పాన్స్ చూడటానికి వెళ్లగా అక్కడ సినిమా చూసి బయటికి వచ్చిన ఒక వ్యక్తి నేను ఎవరని తెలియకుండానే నా ముందు నన్ను బూతులు తిట్టాడు, శివ సినిమా తీసింది వీడేనా అంటూ తిట్టాడు.

అది మర్చిపోలేక పోయాను. ఇక దేవి థియేటర్ హైదరాబాద్ లో సినిమా నూరు రోజులు ఆడుతుందని ఆ థియేటర్ ఓనర్ చెప్పడంతో కొంత ఊరట చెందినా మళ్ళీ వేరే వాళ్ళు ఆ సినిమా రేపో ఎల్లుండో తీసేస్తారు అని మా మావయ్యకు వార్త అందడంతో ఆయన సినిమా పోయిందట కదా, దేవి లో కూడా తీసేస్తారట అన్నపుడు షాక్ అయ్యాను. ఇంటికి వచ్చి రూమ్ లో కూర్చొని ఉంటే నా భార్య భుజం మీద చేయి వేసి ఓదార్చే ప్రయత్నం చేయగా నేను ఏమి బాధపడటం లేదు నీ సింపతీని వేస్ట్ చేయొద్దు నా మీద అని చెప్పగానే నా భార్య కు చాలా కోపం వచ్చింది అంటూ నాకు ఎవరైనా సింపతీ చూపిస్తే నచ్చదు అంటూ వర్మ తెలిపారు.



























