రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడే ఉంటాడు. ఇతని గురించి తెలియకుండా తెలుగు ప్రేక్షకుడే కాదు.. దక్షిణ భారతదేశంలో కూడా ఎవరూ ఉండరు. అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు ఆర్జీవీ. ఒకప్పుడు దర్శకత్వంలో తన మార్క్ ను చూపించిన వర్మ ప్రస్తుతం వివాదాలే అతడి టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇటీవల అమ్మాయిలతో తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. సందర్భం ఏదైనా, పరిణామాలు ఏవైనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు వర్మ. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్, ట్వీట్స్ చేస్తూ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మెగా ఫ్యామిలీపై అతడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అతడు మెగా ఫ్యామిలీపై మరోసారి రెచ్చిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును చిరు ఇంట్లో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు రాఖీ పౌర్ణమి కూడా రావడంతో చాలామంది ఆ వేడుకకు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ అంతా ఆ వేడుకకు హాజరు కాగా కొన్ని కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారు.
దీనిని ఆర్జీవీ టార్గెట్ చేసి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వేడుకకు హాజరైన వాళ్లంతా చిరంజీవి సపోర్టుతో పైకి వచ్చారని.. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే స్వయంకృషితో పైకి వచ్చారటూ ట్వీట్ చేశారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా పరాన్న జీవులని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





























