Ram Gopal Varma: టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు మరణం తర్వాత ఆయనను సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువరు కూడా సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తూ వివాదానికి తెర లేపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోలు కృష్ణంరాజు మృతి చెందినప్పటికీ ఆయనకు నివాళులు అర్పించి అనంతరం తమ సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే వర్మ తనదైన శైలిలో ఈ విషయంపై కామెంట్ చేస్తూ.. లెజెండరీ నటుడు కృష్ణంరాజు చనిపోతే ఆయనకు నివాళిగా సినిమా షూటింగ్ లు ఆపకపోవడంపై ఈయన మండిపడ్డారు. ఆ మహానటుడి కోసం ఒక్క రోజు కూడా సినిమా షూటింగులు ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: ఎంతో సిగ్గుచేటు…
రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ఇలాంటి దుస్థితి రాకమానదు.ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇలా వర్మ టాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మరి కొంతమంది ఇలాంటి సమయంలో ఇలాంటి ట్వీట్ చేస్తూ అందరినీ గెలవడం అవసరమా అంటు కామెంట్లు పెడుతున్నారు.
నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022





























