సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషులందరూ ఒక వైపు, నేను ఒక్కడిని ఒక వైపు అనే డైలాగ్ రాంగోపాల్ వర్మ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది. తను అనుకున్నది అనుకున్నట్లుగా, ఎవరు ఏం చెప్పినా తన మార్క్ మాత్రం వదలకుండా తన స్టైల్లో సినిమాను పూర్తి చేసి ప్రజల్లోకి వదులుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఒకసారి రాంగోపాల్ వర్మ గురించి చూస్తే ఆయన 1962లో తూర్పుగోదావరి జిల్లాలోని కృష్ణం రాజు, సూరమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. ఇంజనీరింగ్ అయితే పూర్తి చేశారు కానీ, తనకు చిత్ర రంగం మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. చిన్నప్పుడు నుండి తాను చూసి వచ్చిన సినిమాలను తన స్నేహితులతో కూర్చుని ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పుల గురించి వాదనలు చేసుకునేవాడు.
తను ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసిన మొదట్లో బ్రతుకుతెరువు కోసం ముందుగా ఒక వీడియో దుకాణం నడిపాడు. ఆ తర్వాత “రావు గారి ఇల్లు” అనే తెలుగు చిత్రానికి సహాయ దర్శకుడిగా అవకాశం లభించడంతో ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ను కలవడంతో, ఆయన అక్కడ నాగార్జునతో ఏర్పరచుకున్న బంధంతో ఆయన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జునతో కలిసి శివ సినిమా తీశాడు. 1990 లో నిర్మించిన శివ అ చిత్రానికి ఇప్పుడు కూడా ఇలాంటి క్రేజ్ తగ్గలేదు. అంతలా అలా ఆ సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించాడు. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో ను కూడా అడుగుపెట్టాడు. అక్కడ కొన్ని సినిమాలు చేసిన తర్వాత అతని నిర్మాణసంస్థ వర్మ కార్పొరేషన్ ద్వారా పలు చిత్రాలను బాలీవుడ్ కు అందించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన శివ, క్షణక్షణం బాగా హిట్ అవ్వగా, ఇక హిందీ సినిమాలలో రంగీలా, సత్య, కంపెనీ, బూత్ సినిమాలు రాంగోపాల్ వర్మ మార్కును చూపెట్టాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డును మూడు సార్లు అత్యుత్తమ దర్శకుడిగా ఆయన అవార్డులను గెలుచుకున్నారు. అలాగే సత్య సినిమా కి ఫిలిం ఫెయిర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడిగా కూడా ఆయన అవార్డు గెలుచుకున్నారు. ఇక తాజాగా లాక్ డౌన్ సమయం లో రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్స్ అనే వెబ్ సైట్ ద్వారా తాను నిర్మించిన సినిమాలను విడుదల చేస్తూ సంపాదిస్తున్నాడు.
ఇక రామ్ గోపాల్ వర్మ ఆస్తిపాస్తులు విషయానికి వస్తే… ఆయన చాలా ఇంటర్వ్యూలో తన ఆస్తిపాస్తులను గురించి అడిగినా ఎటువంటి విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. అయితే అందిన సమాచారం మేరకు… 50 కోట్లకు పైగానే తన ఆస్తిపాస్తులు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆయన కార్ల కలెక్షన్ చూస్తే… ఆయనకు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్ సంబంధించిన కారు ఒకటి ఉంది. అంతేకాకుండా వివిధ నగరాలలో ఆయనకు ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఆయన సొంత ఇల్లు, ఆఫీస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈయన పర్సనల్ విషయానికొస్తే… అనేక మంది హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈయనకు ఇదివరకే రత్న వర్మ అని ఆవిడతో వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక అమ్మాయి కూడా ఉన్నారు. కూతురు పేరు రేవతి. అలాగే రామ్ గోపాల్ వర్మ కి వర్మ విజయ, వర్మ కోటి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.