Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రమ్య తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొని తనుకు నరేష్ ఇచ్చే భరణం అవసరం లేదని తెలిపారు.

నరేష్ నుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే ఈయన మాత్రం ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని దూరం పెట్టారని తెలిపారు. అయితే నరేష్ కువిడాకులు ఇవ్వకూడదని తన కుమారుడు తనతో ఒట్టు వేయించుకున్నాడని అందుకే తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదంటూ ఈమె తెలియజేశారు.
నేను నరేష్ కు విడాకులు ఇవ్వడం కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల వరకు నాకు భరణం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు నేను ఆయన భార్యగా ఉండాలి నా కొడుకుకు తను తండ్రిగా ఉండాలని, అందుకే తాను విడాకులు ఇవ్వడం లేదు అంటూ రమ్య తెలిపారు.

Ramya Raghupathi: ఆయన ఆస్తి డబ్బు నాకు అవసరం లేదు…
ఇక నరేష్ నా కుమారుడి మెయింటెన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నెలకు 50000 చొప్పున పంపించేవారని ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని ఈ సందర్భంగా రమ్య తెలిపారు.నేను నరేష్ ఆస్తులపై ఆయన డబ్బుపై ఏమాత్రం ఆశపడలేదు. ఆయన నా కుమారుడికి తండ్రిగా ఉండాలని ఆయనకు నేను భార్యగా ఉండాలని మాత్రమే ఆశపడుతున్నాను. అందుకే ఆయనకు నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.






























