Rashmi Gowtham : ఈటీవీలో జబర్దస్త్ తరువాత అంత క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్ తో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ జబర్దస్త్ వాళ్ళే వస్తారు. డాన్స్, కామెడీ స్కిట్స్, పాటలు పాడటం ఇలా అన్ని ఉండి సందడిగా ప్రోగ్రామ్ ఉండటంతో టీఆర్పి కూడా బాగా వస్తోంది. సుధీర్ హోస్ట్ గా ఉన్న ఈ షో ప్రస్తుతం జబర్దస్త్ కన్నా మంచి రేటింగ్స్ తో ఉందనే చెప్పాలి. అయితే సుధీర్ ఈ షోనుండి తప్పుకోవడంతో ప్రస్తుతం ఈ షో కి హోస్ట్ గా గత రెండు వారాల నుండి రష్మీ వస్తోంది. రష్మీ యాంకర్ గా వచ్చినా షో రేటింగ్స్ ఏమాత్రం తగ్గడం లేదు.

నాన్న ఎఫెక్షన్ నాకు తెలీదు…
ఇక ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫాదర్స్ డే సెలెబ్రేషన్స్ జరుపుతున్నారు. నాన్న నా హీరో పేరుతో జరగనున్న ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు ఈటీవీ వారు. బుల్లితెర సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు వారి తండ్రులతో షో కి హాజరయ్యారు. బుల్లెట్ భాస్కర్, వాళ్ళ నాన్నతో కలిసి స్కిట్స్ చేసారు. వీధికుక్కలని కాస్త కంట్రోల్ చేయొచ్చుగా అని భాస్కర్ అంటే వాళ్ల నాన్న ఇంట్లో కుక్కనే ఏమి చేయలేక పోతున్నాను, ఇక వీధి కుక్కలను ఏమి తరుముతాను అంటారు.

దానికి భాస్కర్ వెంటనే అంటే నేను కుక్కనా అనగానే అలా అనకు కుక్కలు బాధపడతాయి అని భాస్కర్ వాళ్ళ నాన్న అంటారు. ఇక రష్మీ తన తండ్రి గురించి ఎమోషనల్ అవడం ప్రోమోలో చూపిస్తారు. గుడ్ పేరెంట్, బ్యాడ్ పేరెంట్ ఉంటారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఎలాంటి ఎఫెక్షన్ ను నాన్న నుండి చూడలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక వర్ష మాట్లాడుతూ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా నాన్న లేని లోటు తీరదని బాధపడింది. ఎమోషనల్ గా ఎండ్ అయిన ఈ ప్రోమో మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక రష్మీ యాంకర్ గా వచ్చినా ఈ షో రేటింగ్స్ తగ్గకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.



























