ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖలు చేసారు. జగన్ ప్రతి విషయంలోనూ కమ్మ కమ్మ అంటూ కులాన్ని లాగుతున్నారని విమర్శించారు. అదేసమయంలో ప్రభుత్వానికి సంభందిచిన పోస్టులు అన్ని రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తున్నారని ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గం వారు కనిపిస్తే పక్కన పడేస్తున్నారని, కమ్మ వారు ఎం చేస్తారులే అని అనుకోవద్దు. వారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకుండా ఉంటె ఈపాటికి వేల మంది రాష్ట్రంలో చనిపోయేవారని, అటువంటి ఎన్నికలను వాయిదా వేశారన్న నెపంతో నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం కరెక్టు కాదని రాయపాటి అన్నారు. ఐతే రాజాదాని విషయంలో కూడా వైసీపీ పద్దతి బాలేదని, కరోనా తరువాత అమరావతి గురించి ప్రధాని మోడీతో మాట్లాడతానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా క్వారంటైన్ ఉన్నారని, కానీ జగన్ కి మాత్రం ఏమాత్రం పట్టనట్టు చాలా ఈజీగా తీసుకుంటున్నడని ఆరోపించారు. అయితే జగన్ మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వచించినా సరే వైసీపీ ఓటమి ఖాయం అన్నారు రాయపాటి సాంబశివరావు.






























