Connect with us

Featured

చెన్నై లో అతి విలాసవంతమైన ఆ రెండు ఇళ్ళను రాజశేఖర్ ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది !?

Published

on

హీరో రాజశేఖర్.. తాను స్వతహాగా డాక్టర్ చదివారు. ఫిబ్రవరి 4, 1962న తమిళనాడు రాష్ట్రంలోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో తల్లి తండ్రి శేఖర్, ఆండాల్ పిళ్ళై జన్మించారు. ఈయన తమిళ కుటుంబానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కాకపోతే, రాజశేఖర్ మాతృభాష తెలుగు. ఈయన పూర్వీకులు తెలుగు రాష్ట్రానికి చెందినవారు. ఇకపోతే ఈయన తండ్రి ఒక పోలీస్ అధికారి. ఆయన బాటలోనే మొదట్లో రాజశేఖర్ పోలీస్ అధికారి అవ్వాలనుకున్న చివరికి తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించారు. అలా ఆయన చెన్నై నగరంలో కొద్దికాలంపాటు డాక్టర్ ప్రాక్టీస్ కూడా చేశారు. రాజశేఖర్ కు డాక్టర్ కావాలని దానికంటే ముందు నటుడు కావాలనే ఆశ ఉండేది. మామూలుగా చాలాసార్లు వింటూనే ఉంటాం డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని. కానీ, హీరో రాజశేఖర్ మాత్రం మొదట డాక్టర్ ఆ తర్వాత హీరో అయ్యాడు.

ఈయన సినిమాల్లో నటించాలనే అవకాశం ఇప్పుడు కలిగిందంటే ఆయన కాలేజీ చదువుతున్న రోజుల్లో వారి స్నేహితులు తాను చాలా అందంగా ఉండాలని సినిమాల్లో ప్రయత్నిస్తే కచ్చితంగా హీరో అవుతాడు అని చెప్పడంతో ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. అయితే ఒకానొక సమయంలో గొడవల్లో తన తండ్రికి గాయాలు కావడంతో ఎంతో మంది డాక్టర్లు వచ్చి చివరికి ఆయనను కాపాడారు. దాంతో ఆయన కూడా డాక్టర్ కావాలని ప్రయత్నించి విజయం సాధించాడు. అలా జీవితం కొనసాగుతున్న సమయంలో మళ్లీ ఆయనకు సినిమాల వైపు మనసు మళ్లింది. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎమ్మెస్ చేయాలని భావించాడు. అయితే ఆయనకు తిరిగి సినిమాల వైపు మనసు మల్లడంతో ఆయన సినిమా ఇన్స్టిట్యూట్ లో చేరడానికి కూడా ఓ అప్లికేషన్ ను వేశాడు. అయితే ఆయనకు అటు ఎమ్మెస్ చేయడానికి సీటు వచ్చింది, అలాగే సినిమా ఇన్స్టిట్యూట్లో చేరటానికి కూడా అవకాశం లభించింది. ఆ సమయంలో ఆయన డాక్టర్ జీవితాన్ని పక్కనపెట్టి సినిమా ఇన్స్టిట్యూట్లో చేరటానికి సుముఖత చూపాడు.

అలా ఫుల్ మూవీస్ వచ్చేదాక అక్కడ నీకు వచ్చిన నటనను చూసి చూపించండి అంటూ కోరారు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఎవర్నో ఒకర్ని అనుకరిస్తూ చేశారు. అయితే, రాజశేఖర్ మాత్రం తాను వచ్చిన వెంటనే మాత్రమే చేస్తూ తనదైన శైలిలో వారిని మెప్పించారు. అలా ఆయన ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత ప్రముఖ దర్శకుడు భారతీ రాజా సినిమా ఏబీఎన్ సంస్థకి కొత్త వారితో కలిసి చేయాలనుకున్నాడు. ఆ సమయంలో హీరో రాజశేఖర్ దర్శకుడు భారతీరాజా ను కలుసుకుని తన నటనా ప్రావీణ్యాన్ని చూపించాడు. ఆ సమయంలో ఆయనతో తనకు అవకాశం ఇస్తానని ప్రోత్సాహం ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో మరో కొత్త దర్శకుడు ఆయన హీరోగా అవకాశం ఇస్తామని చెప్పడంతో దానికి రాజశేఖర్ ఓకే అని చెప్పాడు. అయితే ఏం సంస్థతో సినిమా ఆలస్యంగా మొదలవుతుందని ఆ కొత్త డైరెక్టర్ కి హీరోగా నటిస్తాడని మాట ఇచ్చాడు. ఆ తర్వాత హీరో రాజశేఖర్ భారతీరాజా కలిసి తనకి ఇలాంటి అవకాశం వచ్చిందని చెప్పడంతో.. సరే అని భారతీరాజా చెప్పడంతో హీరో రాజశేఖర్ కొత్త డైరెక్టర్ తో సినిమాను మొదలు పెట్టాడు.

అయితే అలా జరుగుతున్న సమయంలో మరోసారి హీరో రాజశేఖర్ భారతీరాజా ను కలవడానికి వెళ్లినప్పుడు ఆయనను నువ్వు మళ్ళీ ఎందుకు నన్ను కలిసావు అని అడిగాడు. హీరో రాజశేఖర్ దాంతో ఆలా ఎలా అని అంటారు మీరు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పారు కదా అని అడగ్గా తాను కొత్త వారితోనే సినిమా తీయాలని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు వేరే వారితో సినిమా చేస్తున్నావు కదా నువ్వు ఎలా హీరోగా చేస్తావు అంటూ ఆయనను చెప్పి బయటకు పంపించేశాడు. హీరో రాజశేఖర్ చాలా బాధపడి అక్కడి నుంచి వచ్చేసాడు. అలా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి డైరెక్టర్ భారతీరాజా హీరో రాజశేఖర్ ను పిలిచి తన దగ్గర హీరో అవకాశం లేదని మరో అవకాశం ఉందని చెప్పడంతో మీరు మీరు ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తానని చెప్పడంతో.. చివరికి హీరోగా చేయాల్సిన సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ గా చేయడం జరిగింది. అలా సినిమా విడుదలైంది విజయం కూడా సాధించింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులోకి అనువదించాలని అరుణకిరణం అనే సినిమా పేరుతో రాజశేఖర్ ను హీరోగా పెట్టి సినిమా విడుదల చేస్తే ఆ సినిమా కూడా తెలుగులో బాగా హిట్ అయింది.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. అలా ఆ తర్వాత అంకుశం సినిమా తర్వాత ఆయన మరోసారి వెనక్కి తిరిగి చూడకుండా టాప్ హీరో గా చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే ఒకానొక దశలో ఆయనకు వరుస ఫ్లాపులు రావటంతో ఆయన అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఆయన చెన్నై నగరంలో ఉన్న రెండు ఇళ్లను, హైదరాబాద్ లోని ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్లీ ఎన్నో కష్టాలు పడి చివరికి ఎవడైతే నాకేంటి సినిమా ద్వారా మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన క్యారెక్టర్ ఏంటో నిరూపించుకున్నాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత గరుడ సినిమా, కల్కి సినిమాలు మరోసారి విజయం సాధించడంతో ఆయన మళ్లీ హిట్ ట్రాక్ పైకి ఎక్కారు. ఇక హీరో రాజశేఖర్ నటన జీవితంలో మరో హీరో సాయి కుమార్ సహకారం ఎంతో ఉంది. సాయికుమార్ హీరో రాజశేఖర్ కి సినిమాలో గాత్ర దానం చేయడంతో ఆయనకు అంత పాపులారిటీ వచ్చి చేరింది. ఇకపోతే రాజశేఖర్ భార్య జీవిత ను వారిద్దరు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే 1991లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక ఉన్నారు. ఈ మధ్యకాలంలో హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా వైరస్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వారికి కరోనా వైరస్ నుండి బయటపడి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతులు కావడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!