తాజగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వేళలను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసులతో పాటూ అన్ని రకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.

ఈ నేపద్యంలో పోస్టాఫీసులలో పాస్ పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటి నుంచి పాస్ పోర్ట్ సేవలు తరిగి ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా గత నెల 12 నుండి నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారి కోసం లాక్ డౌన్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక లాక్ డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.






























