Connect with us

Featured

‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్ కు కూడా టిక్కెట్ పెట్టి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ !

Published

on

ఎడారిలో ఇసుకను అమ్మగలిగేంత అపర మేధావి మన రామ్ గోపాల్ వ‌ర్మ. ఆయన తెలివి తేటలకు నిదర్శనంగా ఈమధ్య ఆన్ లైన్లో విడుదలైన వర్మ చిత్రాలనే చెప్పవచ్చు. ఒకప్రక్క షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడ్డ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. తన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ద్వారా ఆన్ లైన్లో సినిమాలను విడుదల చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈమధ్యకాలంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 టికెట్ పెట్టి కోట్లు సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నగ్నం’ పేరుతో లోకల్ బీ గ్రేడ్ బూతు బొమ్మకు రూ.200 టికెట్ పెట్టి దాని ద్వారా కూడా బాగానే సంపాదించాడు. ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకోవడం బాగా అలవాటు చేసుకున్న రాంగోపాల్ వ‌ర్మ‌ ఇప్పుడు ఏకంగా ట్రైల‌ర్‌కీ టికెట్టు పెట్టి పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళే.. తాజాగా ఆన్ లైన్ లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేయబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్‌ ను టార్గెట్ చేసి తీసిన సినిమాగా ఈ చిత్రం కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘తొలి ప్రేమ’ చిత్రం విడుదలైన రోజే అంటే జులై 24నే ఈ చిత్రం కూడా రిలీజవుతుందని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

ప‌వ‌ర్ స్టార్‌ సినిమా ఎలా వున్నా, అందులో ఏమున్నా, ప‌వ‌న్ ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ చూస్తార‌ని వ‌ర్మ ఆశ‌. పైగా ఇది ప‌వ‌న్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి క్రేజ్ కాస్త ఎక్కువ‌గానే వుంటుందని వర్మ అంచనా. సో.. ఆ క్రేజ్ ని ట్రైల‌ర్ నుంచే క్యాష్ చేసుకోవాల‌ని ఆరాటప‌డుతున్నాడు. కనుక అందరిలాగ ‘పవర్ స్టార్’ ట్రైలర్ ను యూ ట్యూబ్‌ లో ఫ్రీగా చూపించదల్చుకోలేదు వర్మ. ఆ ట్రైలర్ ను చూడటానికి కూడా రేటు పెడుతున్నాడు. సుమారు రూ.50 దాకా టికెట్ పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలిం మేకర్ మన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే కావచ్చు. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన నిజంగా అద్భుతం. ట్రైల‌ర్ చూస్తే గానీ, సినిమాపై ఓ అంచ‌నాకు రాలేం. జ‌న‌మంతా ట్రైల‌ర్ చూసి, సినిమా చూడ‌రేమో అన్న‌ది వ‌ర్మ డౌటు. అందుకే రేటు పెట్టాడు. వ‌ర్మ నుంచి ఏ చిన్న వీడియో వ‌చ్చినా జ‌నం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకోవాల‌నుకుంటున్నాడు. వర్మా… కరోనా టైంలో ఏంటీ ఖర్మా.?!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!