Featured

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురి పరిస్థితి విషయం..

అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని బ్రహ్మణపల్లెకు కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఒకరు

Published

on

అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని బ్రహ్మణపల్లెకు కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఒకరు మరణించారు. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు ఇలా తెలిపారు. వాళ్లంతా రోజూ పత్తి తీసేందుకు కూలీ పనులకు వెళ్తుండేవారు. తాడిపత్రి నుంచి బ్రహ్మణపల్లిలో పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇలా నేడు వారంతా మినీ ఐచర్ లారీలో వెళ్తుండగా.. వాహనం అదుపు తప్పింది.

చుక్కలూరు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు. వాహనాలు నడిపే సందర్భంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని.. మద్యం సేవించి వాహనాలను నడపరాదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారి బంధువులు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.

Advertisement

Trending

Exit mobile version