టాలీవుడ్ లో టాప్ హీరోలందరితోనూ నటించి హీరోయిన్ గా పాపులరైన రోజా అటు రాజకీయాలలో ప్రజా ప్రతినిధిగానూ.. ఇటు జబర్దస్త్ టీవి షో ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువయ్యారో మీకు తెలుసు. ఫైర్ బ్రాండ్ లేడిగా పేరు తెచ్చుకున్న రోజా నిజానికి చెంబరుతి చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సందర్భంలోనే చిత్ర దర్శకుడు సెల్వమణితో రోజాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు ఏడడుగులు వేసేవరకూ వచ్చింది. రోజా, సెల్వమణి వివాహం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చెప్పుకోతగ్గ విషయమేమిటంటే..

డైరెక్టర్ సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించిన తర్వాతే రోజాకు తన ప్రేమ సంగతి తెలియజేశాడట. రోజా కూడా సెల్వమణి ప్రేమకు ముగ్ధురాలై ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుంది. ఆ తర్వాత పెళ్ళి.. రాజకీయ రంగ ప్రవేశం షరా మామూలే..! సినిమా రంగంలో నటించడమే ఒక అదృష్టమనుకుంటే తాము కోరుకున్న వ్యక్తినే పెళ్ళి చేసుకోవడం మహా అదృష్టమనే చెప్పొచ్చు. కానీ రోజా దంపతులను సమరం అనే తెలుగు సినిమా రూపంలో దురదృష్టం రూపంలో వెంటాడిందని చెప్పవచ్చు. ఎలాగంటే..

1994లో సమరం అనే ఓ యాక్షన్ మూవీకి రోజాయే స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. అందులో సుమన్, రోజాలు జంటగా నటించారు. కానీ ఎందుకనో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఇదండి సంగతి.. అదృష్టం వెనకనే దురదృష్టం కూడా వుంటుందనే జీవిత సత్యానికి రోజా నిజ జీవితంలోని ఈ ఒక్క ఉదాహరణ చాలన్నమాట.!




























