మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.డఈ నెల 8న నల్లగొండలో రాజకీయ సంకల్ప సభలో ఆ పార్టీ కండువ కప్పుకునే అవకాశం ఉంది. లక్ష మందితోఈ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో ఎంజీ గ్రౌండ్ వేదికగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు స్వఛ్చదంగా హాజరుకావాలని బీఎస్పీ నాయకులు తెలిపారు. అలాగే ఈ సభకు బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

తెలంగాణలో బీఎస్పీ క్యాడర్ కూడా ప్రవీణ్ కుమార్ చేరికను స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాధికారం దిశగా పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ తెలిపారు.





























