Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న సాయి ధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్ వల్ల తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ చాలా కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అనారోగ్యం నుండి కోలుకొని మామూలు మనిషిలా ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ సినిమా గురించి,తన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు అభిమన్యులతో పంచుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి తనని కాపాడిన వ్యక్తికి తాను చేసిన సహాయం గురించి వెల్లడించాడు..ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..సరైన సమయంలో అతను నన్ను కాపాడకపోతే నేను ఈ రోజు మీ ముందు ఉండేవాడిని కాదు. మానవత్వంతో అతను నాకు చేసిన సహాయానికి నేను డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేను.

Sai Dharam Tej: తనకోసం ఎంత దూరమైనా వెళ్తా…
అందుకే అతన్ని కలిసి నా నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా ఫోన్ చేయమని చెప్పాను .నా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతడికి ఏమైనా సాయం చేశారో లేదో నాకు తెలియదు. కానీ అతనికి సహాయం చేయటానికి నేను ఎంత దూరమైన వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆ రోజు డైరెక్టర్ దేవకట్ట ఇంటికి తాను వెళుతున్నానని తెలిపారు.





























