Sai Pallavi : అ మాత్రం నెగెటివిటీ లేకుండా వివాదాలు లేకుండా కనీసం తనపై లవ్ రూమర్స్ కూడా లేకుండా కెరీర్ లో క్లీన్ వైట్ పేపర్ లా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం ఒక వివాదంలో ఇరుక్కుంది. విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న సాయి పల్లవి మతం గురించి చేసిన వాఖ్యలపై కొంతమంది విరుచుకుపడుతున్నారు. సాయి పల్లవి ని సోషల్ మీడియా వేదికగా ఒక వర్గం వారు బాగా ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలను చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సాయి పల్లవి పై కేసు పెట్టిన భజరంగ్ దళ్ నాయకులు…
సాయి పల్లవి విరాట పర్వం సినిమా ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. ఎవరు తప్పు, ఒప్పు అని చెప్పలేము, కొన్ని రోజుల ముందు ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ సినిమాలో ఒకప్పుడు కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా… వాటిని మనం మత ఘర్షణలా చూస్తే.. తాజాగా ఓ బండిలో ఎవరో ఆవులని తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లింలాగా ఉన్నాడు వాటిని చూసి కొంత మంది అతన్ని కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడ వుంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా వుంటే ఇతరులను బాధించం. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం కరెక్ట్ గా వుండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు” అని చెప్పుకొచ్చింది.

ఇపుడు ఈ వాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఏకంగా భజరంగ్ దళ్ నాయకులు పోలీస్ కేసు పెట్టే వరకు వెళ్ళింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి పై కేసు పెట్టారు భజరంగ్ దళ్ వారు. గో సంరక్షకులను కాశ్మీరి తీవ్రవాదులతో సాయి పల్లవి పోల్చిందని అది మా మనోభావాలను దెబ్బతీసిందని వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో పరిశీలించి న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

































