సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో మాములుగా లేదు. ఫిదా సినిమా చేసేటప్పుడే ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. ఇప్పుడు సారంగదరియా పాటతో ఓ రేంజ్ ఇమేజ్ ని దక్కించుకుంది. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది..
ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి హీరోకుండే మార్కెట్ ను ఏర్పరుచుకుంది. దందుకే ఆమెను పెట్టుకోవడానికి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్న సాయి పల్లవి తన చెల్లెలిని కూడా రంగంలోకి దింపుతోంది..సాయి పల్లవికి ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. ఇక సాయి పల్లవికి పూజా కన్నన్ అంటే ఎంతో ఇష్టమట. కాగా తన చెల్లెలు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం సాయిపల్లవి తెగ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
అయితే స్టంట్ కొరియోగ్రాఫర్ సెల్వ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో పూజా కన్నన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో సముద్రకని, సెల్వ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కింది. విశేషమేంటంటే సాయి పల్లవిల పూజా కన్నన్ కూడా మంచి డాన్సర్. ఏ. ఎల్ విజయ్ కు అసిస్టెంట్ గా పని చేసిన పూజా కన్నన్ ఇప్పుడు ఆయన కథ తోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి పూజా కన్నన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



























