టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకొని తనదైన శైలిలో దూసుకుపోతోంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సాయి పల్లవి,ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’. 2019 లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘అతిరన్’. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మాధ్యమం లో సందడి చేయనుంది. మలయాళంలో ‘అతిరన్’పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఆహా ఈ సినిమాకి సంబంధించి నటువంటి టీజర్ విడుదల చేసింది.
ఈ టీజర్ లో సాయి పల్లవి పిచ్చిదానిగా మారిపోయి చేసిన నటన ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
ఇకపోతే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సందడి చేయనున్నారు. అదే విధంగా సాయి పల్లవి నాని “శ్యామ్ సింగ రాయ్ ” సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.





























