Movie News

Saidharam Tej: ప్రమాదం తర్వాత వారినే ముందుగా చూసాను… ప్రతి ఒక్కరూ క్షమించాలి: సాయి ధరమ్ తేజ్

Saidharam Tej: సుప్రీం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను ప్రమాదానికి గురై ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించాలని ఈయన క్షమాపణలు చెప్పారు..

ఇలా ప్రమాదం తర్వాత తాను స్పృహలోకి వచ్చినప్పుడు మొదటగా తన తల్లిని తన తమ్ముడిని చూసానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.అయితే ఆ సమయంలో వారికి సారీ చెప్పాలని చూసిన నాకు మాటలు రాలేదని ఒక బాధ ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో అప్పుడే తనకు అర్థమైందని తెలిపారు. ఎలాగైనా తిరిగి మీ ముందుకు రావాలి మీ ప్రేమను పొందాలన్నా లక్ష్యంతో తాను మీ ముందుకు వచ్చానని తెలిపారు.

Saidharam Tej: హెల్మెట్ తప్పనిసరి….

లక్ష్యం సాధించడం కోసం మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరు వెనక్కి తగ్గకూడదని మన లక్ష్యాన్ని చేదించి తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా చేయాలని ఈయన తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఈయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“అమ్మాయిలూ… ఉదయం ఈ చిన్న అలవాటు పెంచుకుంటే జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది!”

అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…

11 minutes ago

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

59 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 hour ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

13 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

16 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

16 hours ago