Connect with us

Featured

కాపీ మరకలంటించిన అల.. చిత్రానికి అవార్డుల పంట.. అన్నీ బెస్టే !

Published

on

మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో లాగే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆయన సినిమాలో మాటలే తూటాల్లా దూసుకెల్తాయి కాబట్టి. కొన్ని డైలాగులు జనాల మనసులను గట్టిగా తాకుతాయి.

ప్రతీ అక్షరం, పదం ఎంతో జాగ్రత్తగా అమర్చి త్రివిక్రం రాసే డైలాగ్స్ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి. మనకి వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు..రానిది ట్రై చేయకూడదు. జులాయి సినిమాలో త్రివిక్రం రాసిన డైలాగ్. ఇది ఎంతమంది తమకి తాము ఆపాదించుకున్నారో లెక్కేలేదు.  

బాచిరెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు..అతణ్ని చంపితే మీరు హంతకుడవుతారు..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే బావుంటుంది, గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పొచ్చు కానీ గుండెల్లో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలం, అందంగా ఉండటం అంటే మనకి నచ్చినట్టు ఉండటం.. ఎదుటి వారికి నచ్చినట్టు ఉండటం కాదు.. నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది నాన్నా.. చెప్పకపోతే ఎప్పుడు భయమేస్తుంది.. ఇలాంటి ఎన్నో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

అందుకే ఆయన మాటల మాంత్రీకుడు అయ్యారు. సామాన్య ప్రేక్షకుడికి కూడా త్రివిక్రం రాసే మాటలు హృదయంలోకి దూసుకు వెళతాయి. అందుకే త్రివిక్రం సినిమాలకి అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉంటారు. అయితే ఆయన త్రివిక్రం సినిమాలలో చాలా వరకు కాపీ సన్నివేశాలుంటాయని తరచూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన అతడు, ఖలేజా, జులాయి, అ..ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలాగే గత చిత్రం అల వైకుంఠపురము లో లాంటి సినిమాలలో కొన్ని సీన్స్ ఆయన హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని ప్రచారం జరిగింది.

అ..ఆ సినిమాను అప్పటి మీనా నవల, చిత్రం ఆధారంగా తీసినట్టు ఆయనే ఒప్పుకున్నారు. అలాగే అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఇంటిగుట్టు అనే సినిమాకి కాపీ అని ప్రచారం జరిగింది. సినిమాకి ముందు జరిగిన ప్రచారమే తర్వాత సినిమా రిలీజయ్యాక కూడా చేశారు. ఇవన్నీ జనాలు పట్టించుకోలేదు. అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. 2020 సంక్రాంతి బరిలో దిగి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి థమన్ మ్యూజిక్ ప్రధాన కారణం అయింది. భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అంతేకాదు తాజాగా సాక్షి అవార్డ్స్‌లో కూడా అల వైకుంఠపురానికి 5 అవార్డులు దక్కడం గొప్ప విశేషం.

ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా హీరోయిన్ పూజా హెగ్డే, ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ అవార్డులను దక్కించుకున్నారు. కాపీ మరకలంటించిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇలా అవార్డుల పంట పండటం మాత్రం గొప్ప విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!