Samantha : సమంత, నాగచైతన్య ప్రేమించుకున్నారు, ఆ పై పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత నాలుగేళ్లు సంసారం సజావుగానే సాగినా ఇక ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. పిల్లల విషయంలో అభిప్రాయబేధాలు రావడం వల్లే ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం జరిగినా నిజానిజాలు ఎవరికీ తెలియవు. ఇక సమంత మీద అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మీద సామ్ ఫ్యాన్స్ ట్రోల్ల్స్ అన్ని మామూలే అయిపోయాయి. ఇక ఇద్దరూ మళ్ళీ వేర్వేరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓ వైపు రూమర్స్, నిత్యం ఏదోక విషయంతో ఇద్దరూ సోషల్ మీడియాలో నానుతున్నారు.

సామ్ కి ఆమె శాపం తగిలింది…
ఇక అక్కినేని ఆడపిల్ల కాకపోయినా నాగార్జున ముద్దుల మేనకోడలు సుప్రియ సింగల్ ఉమన్ గా ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ సినిమా నిర్మాణం లో కూడా అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ గా ఉంది. అయితే ఈమె భర్త మరణం తరువాత ఒంటరిగానే ఉంటోంది. తన పని తాను చేసుకుపోతూ ఉన్న సుప్రియ ఏనాడూ వార్తల్లో నిలవలేదు. కానీ అప్ కమింగ్ హీరో అడవి శేష్ తో ఈమె ఎక్కువగా కనిపించడంతో అడవి శేష్ తో కలిసి కొన్ని సినిమాలకు పని చేయడం వల్ల పరిచయం ఏర్పడి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట అని అందరూ అనుకున్నారు.

ఇవన్నీ ఒకప్పుడు వచ్చిన పుకార్లు అయితే ఆ సమయంలో సమంత అడవి శేష్ కి సుప్రియకి వర్క్ అవుట్ కాదు అంటూ వాళ్ళ మధ్య అడ్డుపుల్ల వేసిందట. దాంతో వారి పెళ్లి మాట కాస్త అటకెక్కిందట. అయితే ఇపుడు సమంత, నాగ చైతన్య తో విడిపోవడం తో నన్ను సింగల్ గా ఉంచిన సమంతకు నా శాపమే తగిలింది అందుకే తను సింగిల్ గా మిగిలిపోయింది అంటూ సుప్రియ తన సన్నిహితులతో వాపోయిందట. అలా సుప్రియ శాపం వల్లే సమంత ఒక్కతైపోయిందంటూ ప్రస్తుతం ఇలా మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.



























