వెండితెర పై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ కోసం వినియోగిస్తూ ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత విడాకుల అనంతరం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిని అలరింప చేశారు.
ఇప్పటికే సమంత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి షూటింగ్ పూర్తి చేసిన నిర్వాహకులు ఈ ఎపిసోడ్ ను వచ్చే వారంలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారన్న సమాచారం వినబడుతోంది. ఈ ఈ కార్యక్రమంలో లో హాట్ సీట్లో ఉన్న సమంత ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఎంతో చాకచక్యంగా ఆట ఆడినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా మీలో ఎవరు కోటీశ్వరులు ఈ కార్యక్రమంలో సమంత 25 లక్షలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమంతా ఈ మొత్తం డబ్బును తాను నిర్వహిస్తున్నటువంటి ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం సమంత విడాకుల విషయంలో ఎంతో బాధపడుతుండగా ఆ బాధను బయటకు వ్యక్తం చేయకుండా తన సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఉండటం చూసి నెటిజన్లు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
విడాకుల అనంతరం సమంత గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఖండించారు.ఇక జీవితంలో ఒంటరిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్న సమంత విడాకుల తర్వాత వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…