టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత. ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా పేరు సంపాదించుకుంది. ఇక వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలలో అవకాశం అందుకొని మంచి సక్సెస్ లను అందుకుంది.
వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనేంటో నిరూపించుకుంది. ఎన్నో వాణిజ్యపరమైన ప్రకటనలలో చేసింది. అంతేకాకుండా తన భర్త నాగచైతన్యతో కూడా పలు ప్రకటనలలో చేసింది. ఇక ఫ్యాషన్ విషయంలోఎప్పుడు ట్రెండీగా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో కూడా గార్డెనింగ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది.
ఇవన్నీ ఇలా ఉంటే బిజినెస్ పరంగా కూడా సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే పలు బిజినెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇక తన సొంత డిజైనింగ్ కంపెనీ సాకీ లో కూడా బాగా బిజీగా మారింది. పైగా వాటి డిజైన్స్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు తానే స్వయంగా ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఇక ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్ ను కూడా నడుపుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెడుతుంది సమంత. అది కూడా జ్యువెలరీ బిజినెస్ పై ఆలోచనలు చేస్తుందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో తెలపనున్నారు. మొత్తానికి అటు ఇండస్ట్రీలో ఇటు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సమంత అక్కినేని కోడలు గా నాగార్జునకు మంచి గుర్తింపు అందిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్ బిజినెస్ రంగంలో అడుగులు పెట్టగా అందులో తమన్నా కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…