సమంత, నాగచైతన్య సమంతా విడాకుల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. సోషల్ మీడియాలో అంతా నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు కానీ, అందుకు గల అసలు కారణం ఏమిటి అనేది ఎంతవరకు వెల్లడించలేదు.

దీనితో వీరిద్దరి విడాకులకు అసలు కారణం అదే అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తప్పు అంతా కూడా సమంతానే అన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా సమంతకు అఫైర్స్ ఉన్నాయి అని కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలు వినయ వినయ విసిగీపోయిన సమంత ఆఖరికి ఆ రూమర్స్ ఫై స్పందిస్తు వాటిలో ఎటువంటి నిజం లేదంటూ,అవన్నీ కల్పితాలే అంటూ కొట్టి పారేసింది.
సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంతా లో చాలా మార్పులు వచ్చాయి. ఆమె విడాకులు అనంతరం ఆ బాధ నుంచి కోలుకోవడానికి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి రీతిలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలలో పాల్గొంది. సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాకుండా సమంత చాలా వరకూ సన్నిహితులతో సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సమంత తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కూతుళ్ళు ఉన్న తల్లిదండ్రులకు ఆమె హితబోధ చేసింది.మీ కూతుళ్ళని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్ధులుగా తీర్చిదిద్దండి. వారికి తొందరగా పెళ్ళి చేసేయాలన్న ఆలోచన విడనాడండి. వారిని పెళ్ళికోసం ప్రిపేర్ చేయడం కంటే వారిని వారిగా ఉండేలా చేయడం ముఖ్యం. పెళ్ళికోసం పోగేసిన డబ్బుల్ని వారి విద్యకోసం కేటాయించండి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా చేయండి అంటూ సమంత తల్లిదండ్రులకు సూచించారు. సమంతా పెట్టిన ఈ పోస్ట్ కు నెటిజెన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.































