Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మాయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నటువంటి సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఇది మాత్రం సముద్రపు వ్యూ కనిపించేలా ఉన్నటువంటి ఇంటి బాల్కనీలో ఫోటో దిగినట్టు తెలుస్తోంది. దీంతో సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత సన్నిహితుల సమాచారం మేరకు సమంత తన సొంత రాష్ట్రమైన చెన్నైలో కాకుండా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.ఇలా మూడు పడకల గది కలిగి ఉన్నటువంటి ఇంటిని సమంత ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఈ విధంగా సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందని భావిస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అవుతున్నారు. దీంతో షూటింగ్ ముంబై వెళ్లాల్సి ఉంటుంది కనుక ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సమంత కారణంగానే వాయిదా పడిన త్వరలోనే తిరిగి షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…