విజయశాంతి… తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఈవిడ. ఈవిడ జూన్ 24, 1966 సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రుల పేర్లు సత్తి శ్రీనివాస్ ప్రసాద్, సత్తి వరలక్ష్మి. ఈమెకు టాలీవుడ్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ పిలవబడతారు. నటి విజయశాంతి ఇప్పటివరకు తన తెలుగు, తమిళ సినీ నటి జీవితంలో… 30 సంవత్సరాల ఇండస్ట్రీ కాలంలో ఆవిడ ఏకంగా వివిధ పాత్రలను 180 సినిమాలకు పైగా నటించారు. అంతేకాదు ఆమెకు 1991 సంవత్సరం లో కర్తవ్యం సినిమాలో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. అంతేకాకుండా ఆమె ఏకంగా ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ , ఆరు సార్లు ఉత్తమ నటిగా, అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు నాలుగు సార్లు, దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ 2003వ సంవత్సరంలో అందుకున్నారు.
ఇక ఈమె నటన జీవితానికి కారణం అప్పటి హీరోయిన్ విజయలలిత. నిజానికి విజయశాంతి ఏడు 7 ఏళ్ల ప్రాయంలోనే బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించింది అని చెబుతారు. కానీ ఆమె ఏ చిత్రాల్లో నటించింది అన్న విషయాలు సరిగ్గా లేవు. ఇకపోతే విజయలలిత తన హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో విజయశాంతిని, ఆమె తల్లిని, ఆమె పిన్ని శ్రీ శాంతిని చెన్నైలోని టీ నగర్ లో విజయలలిత ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే విజయశాంతి 1979వ సంవత్సరంలో తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ అనే సినిమా ద్వారా భారతీరాజా దర్శకత్వంలో ఈవిడ తన మొదటి సినిమాను చేశారు. ఇక అలా ప్రస్థానం కొనసాగుతూ వెళ్ళింది. అయితే విజయశాంతి తన నటనా జీవితంలో మొదట్లో కేవలం ఒక డాన్సర్ గా మాత్రమే సినిమాకు పరిచయం అయింది. అదికూడా సోలో డ్యాన్సర్గా పరిచయమై అనేక సినిమాల్లో కేవలం డాన్స్, చిన్నచిన్న డైలాగులు తోనే నెట్టుకొచ్చింది.
అనేక సినిమాల్లో నటించిన చివరికి తన నటన చూపించే తగ్గ సినిమాలు రాకపోవడం నిజంగా ఆమెకు ఒకనొక సమయంలో బాధ వేసింది. ఇకపోతే అప్పట్లో టీ. కృష్ణ దర్శకుడు ఉండేవారు. ఆయన తీసిన ఏడు సినిమాల్లో కేవలం విజయశాంతి మాత్రమే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఇక దీనితో ఆ సినిమాల్లో విజయశాంతి తనలోని నటన చూపించే విధంగా పాత్రలు చేసింది. ఇక అంతే అప్పటి నుంచి విజయశాంతి స్టార్డం మారిపోయింది. ఆ తర్వాత తను విజయలలిత దగ్గర నుంచి బయటకు వచ్చి తన తల్లితో వేరొక చోట ఇల్లు తీసుకుని అక్కడ జీవనం కొనసాగించారు.
అయితే తనలోని నటనను బయటికి చూపించిన టి.కృష్ణ క్యాన్సర్ మూలంగా చనిపోవడంతో విజయశాంతి రెండు రోజులు అసలు అపస్మారక స్థితిలో లేకపోవడం నిజంగా ఆవిడను అంతలా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది. విజయశాంతి కి తనకు జీవితంలో సహాయం చేసిన వారిని, గొప్ప స్థాయికి చేరిన వారిని ఆమె ఎప్పుడూ మర్చిపోకుండా సదరు మర్యాద చూపుతుంది. విజయశాంతి ఈ సంవత్సరం రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.