Connect with us

Featured

Senior Actress Nalini : చిరంజీవి డాన్స్ రిహార్సల్స్ పదిసార్లు చేస్తే.. నేను ఒకేసారి చేసేదాన్ని… అప్పుడు అలా ఉండేది. : హీరోయిన్ నలిని

Published

on

నళిని తమిళం, మలయాళం, కన్నడ మరియు తెలుగు చిత్రాలలో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి మరియు టెలివిజన్‌లో పనిచేసింది. తమిళనాడులో మూర్తి మరియు ప్రేమ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో రెండవ వ్యక్తిగా నళిని 1964 ఆగస్టు 28న జన్మించింది. ఆమె తండ్రి తమిళ సినిమాలలో కొరియోగ్రాఫర్ మరియు ఆమె తల్లి ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమెకు 7 మంది తోబుట్టువులు, ఒక సోదరి మరియు ఆరుగురు సోదరులు ఉన్నారు. ఆమె ఏడవ తరగతి వరకు TN ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది; అప్పటికి సినిమాలతో బిజీగా ఉండడంతో చదువు కొనసాగించలేకపోయింది.

నళిని 1987లో నటుడు రామరాజన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కవలలు ఉన్నారు; అరుణ మరియు అరుణ్, 1988లో జన్మించారు. అయితే, వారు 2000లో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆమె కుమార్తె అరుణ 6 మే 2013న రమేష్ సుబ్రమణియన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె కుమారుడు అరుణ్ పవిత్రను 25 ఏప్రిల్ 2014న వివాహం చేసుకున్నారు. 1983 తమిళ డబ్బింగ్ చిత్రం “ప్రేమ సాగరం” చిత్రం ద్వారా తెలుగు యువ ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవడంతో తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి ప్రక్కన “సంఘర్షణ” చిత్రంలో నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే చివరి చిత్రం అంటూ నలిని దాదాపు వంద చిత్రాల్లో నటించారు.

అయితే ఈ మధ్య ఆమె ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఒక రోజు దాదాపు నాలుగైదు షిఫ్ట్ లలో నటించే దానిని.. తనకు నిద్ర కూడా సరిగా ఉండేది కాదని. మా అమ్మగారి బలవంతంతో సినిమాలలో నటించానని. అయితే సంఘర్షణ సినిమాలో “సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా”.. అనే పాటకు చిరంజీవి ఎంతగానో కష్టపడ్డారని.. ఆయన‌ పదిసార్లు ప్రాక్టీస్ చేసి ఆ పాటకు డ్యాన్స్ చేశారని.. కానీ నేను ప్రాక్టీస్ చేయకుండా డాన్స్ చేశానని.. చిరంజీవి డాన్స్ అంటే ఒళ్ళు హూలం చేసుకుంటారని.. రోజూ నాలుగైదు షిఫ్ట్ లలో పని చేసేసరికి సినిమాలపై అంతగా ఆసక్తి తనకు ఉండేది కాదని వెళ్ళిపోదాం అంటే.. మా అమ్మగారు ఇదే లాస్ట్ సినిమా అంటూ నటింపజేశేవారని.. తాను ఏడవ తరగతి చదువుకుంటున్న సమయంలోనే మలయాళ ‌సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అప్పటికే సినిమాలంటే తనకు అంత అవగాహన లేదని.

ఆ తర్వాత మరో తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు. T.రాజేందర్ తనను చూసి “ప్రేమసాగరం” చిత్రానికి హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా తమిళ తెలుగు భాషలలో దాదాపు సంవత్సరకాలం పాటు ఆడిందని.. ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నలిని చిరంజీవితో “ఇంటిగుట్టు” అనే చిత్రంలో నటించారు. తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చాలా కాలం విరామం తీసుకుని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన “వీడే” చిత్రంలో నటించారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “కిక్” చిత్రంలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె బుల్లితెరలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!