Connect with us

Featured

తనను అవమానిచిన వ్యక్తి తో హీరో అయ్యాక శోభన్ బాబు ఎలా ప్రవర్తించారో తెలుసా ?

Published

on

టాలీవుడ్ సోగ్గాడు, నటభూషణడైన శోభన్ బాబు సినిమాలో హీరో అవ్వాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ఒక డొక్కు సైకిల్ పై ప్రతి స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టే వారు. అప్పటికే అతనికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మద్రాసులోనే ఒక రెంట్ ఇంట్లో భార్యా పిల్లలతో జీవితం కొనసాగిస్తూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వంద రూపాయలతో సంసారం సాగదీసిన శోభన్ బాబు సినిమాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలనుకొనేవారు. ఆ సమయంలోనే రాజనాల విలన్ గా నటిస్తున్న ఒక సినిమాలో రెండు నిమిషాల పాటు నటించే అవకాశం వచ్చింది. అప్పటివరకు కాళ్లరిగేలా తిరిగినా శోభన్ బాబు ఆ పాత్రలో నటించేందుకు తెగ ఉత్సాహపడ్డారు. అప్పట్లో రాజనాల అంటే సినిమాల్లోనే కాదు బయట కూడా భయపడేవారు. అతని గొంతులో, మొహంలో అంత గాంభీర్యం ఉట్టిపడేది.

అసలే నటించడం కొత్త, మళ్లీ చూస్తేనే భయం కల్పించే రాజనాల తో సన్నివేశం చేయాలనగానే శోభన్ బాబు కి ఎక్కడ లేని భయం పట్టుకుంది. కానీ వచ్చిన ఒక పాత్రను కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో నటించేందుకు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో రాజనాల తో రెండు నిమిషాలపాటు అతని పాత్ర ఉండగా… ఆ పాత్ర చేయడానికి శోభన్ బాబు అనేకమైన రీటేక్స్ తీసుకున్నారు. దీంతో బాగా ఆగ్రహించిన రాజనాల ఎవరయ్యా ఇతను, ఎందుకు పట్టుకొచ్చారు, అయ్యా? నటన రాదు పాడు రాదు. నేను అసలు ఈ సన్నివేశంలో చేయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా అక్కడి సినీ బృందాన్ని తిట్టి వెళ్లిపోయారు. నలుగురి ముందు రాజనాల తనపై అరవడంతో ఎంతో ఆత్మాభిమానం ఉన్న శోభన్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కానీ రాకరాక వచ్చిన ఒక చిన్న పాత్రలో నటిస్తే కాస్త డబ్బులు అయినా వస్తాయని భార్యా పిల్లల ఖర్చుల కైనా పనికొస్తాయని శోభన్ బాబు తన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం చంపుకుని మళ్లీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ అని బతిలాడాడు. కానీ ఆ సినీ బృందం రాజనాల కి భయపడి మీరు వద్దులేండి, ఇంటికి వెళ్లిపోండి… ఛాన్స్ ఇచ్చి మళ్లీ రాజనాల చేత మాటలు పడలేమండి అని చెప్పేసారు. దీంతో అవమానానికి గురి అవడంతో పాటు వచ్చిన ఛాన్స్ కూడా పోయేసరికి శోభన్ బాబు బాగా మనస్తాపం చెందాడు.

కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత రాజనాల వ్యసనాలకు అలవాటుపడి నటన పై పూర్తిస్థాయిలో ఆసక్తి కోల్పోయాడు. ఆ సమయంలోనే అతని భార్య కూడా చనిపోయింది. దీంతో రాజనాల ఇంకా మానసికంగా క్రుంగి పోయాడు. ఆదరించాల్సిన కొడుకు కూడా నిర్లక్ష్యం చేసి రూపాయి బిళ్ళ ఇవ్వకుండా బయటకి గెంటేసాడు. దీంతో చేసేదేమీ లేక సినిమా అవకాశాలు రాక, తెలిసిన వాళ్ళ వద్దకు వెళ్లి పదో పరకో అడిగి తన చివరి రోజులు గడుపుతుండేవాడు. ఒకానొక రోజు రాజనాల చాలా దీనస్థితిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే శోభన్ బాబు చూశాడు. అప్పటికే శోభన్ బాబు అనేక సినిమాల్లో నటించి కోట్లాది రూపాయలు సంపాదించి పెద్దపెద్ద కారులలో తిరుగుతున్నాడు. అనుకోకుండా తన ని అవమానించిన రాజనాల ను చూసిన శోభన్ బాబు వెంటనే కారు దిగి గురువు గారు ఎలా ఉన్నారు నేను శోభన్ బాబు ని నన్ను గుర్తు పట్టారా అంటూ కారులో అతనిని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్లి కడుపునిండా భోజనం పెట్టించి ఆ తర్వాత ఒక పెద్ద సంచి ఇచ్చి… ఈ కవర్ లో ఏముందో మీరు తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర విప్పాల్సిందే అని చెప్పి అతడిని ఇంటిదగ్గర కార్ లో దించేసి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత సంచి లో ఏముందో అని తెరిచి చూసిన రాజనాలకు 25వేల రూపాయలు కనిపించాయి. దాంతో ఒక్కసారిగా రాజనాల కంట నీళ్లు చెమ్మగిల్లాయి. తనని అహంతో అవమానించిన రాజనాలకు కూడా ఒకటి కాదు రెండు కాదు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారంటే శోభన్ బాబు మనసు ఎంత ఉదారమైనదో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!