Senior Journalist Bhardwaja : మహాభారతం లోని కురుక్షేత్రం ఉదంతం తో తెరకెక్కిన రెండు చిత్రాలు ఒకటి ఎన్టీఆర్ ‘డివిఎస్ కర్ణ’ అయితే మరొకటి కృష్ణ ‘కురుక్షేత్రం’. రెండు సినిమాల్లోనూ ఒకటే కథ. ఇక ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తూ కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మూడు పాత్రలలో మెప్పించారు. ఇక ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు గా బాలకృష్ణ అభిమన్యుడిగా మెప్పించారు. కేవలం 45 రోజుల్లో షూటింగ్ చేసిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. 1977 జనవరి 14 న సినిమా విడుదల అయి కోటి రూపాయల గ్రాస్ అప్పట్లోనే సాధించి రికార్డులు సృష్టించింది.

కొండవీటి వెంకట కవి రచన ఎన్టీఆర్ ఆలోచనలు కలిసి డివిఎస్ కర్ణ…
చాలా కాలంనుండి ఎన్టీఆర్ కు కర్ణుడు మీద సినిమా చేయాలనే ఆలోచన ఉండడం, అందుకు అనుగుణంగా డైలాగులు రాయగల వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో గతంలో కథనాయకుడి కథ సినిమాకు పనిచేసిన మోదుకురి జాన్సన్ గారు డైలాగులు రాసారు. అందులో హీరో పాత్ర కర్ణుడి పాత్ర. బలహీన వర్గాలు ఇండియా లో ఎలా నష్టపోతున్నాయి అన్న కోణంలో ఆయన రాసిన డైలాగులు ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నాయి. ద్రావిడ భావజాలం ఉన్న ఎన్టీఆర్ జాన్సన్ అయితే బాగుంటుందని భావించి పిలవగా ఇతర సినిమాలతో బిజీగా ఉన్న ఆయన పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ కొండవీటి వెంకట కవి గారిని సిఫార్సు చేశారు.

ఆయనను పిలిపించుకుని సినిమా ఎలా తీయాలనీ ఎన్టీఆర్ అనుకున్నారో ఆ లైన్స్ చెప్పి డైలాగలను వెంకట కవి వద్ద రాయించుకున్నారు. వెంకట కవి గారికి సహాయంగా పొన్నూరు సంస్కృతం కళాశాలలో పనిచేసే మరో అధ్యాపకుడు కత్తి పద్మారావు ను కూడా తీసుకున్నారు. ఎలా ఎన్టీఆర్ ఆయన చెప్పాలనుకున్న అప్పటి పరిస్థితుల్లో బలహీనలకు జరుగుతున్న అన్యాయం, ప్రతిభ ఉండి అందుకోలేకపోతున్న అవకాశాలు అన్న కోణం. అలాగే ఆర్య సంస్కృతి ప్రభావం ద్రావిడ సంస్కృతి మీద వంటి అంశాలను దాన వీర శూర కర్ణ ద్వారా సమాజానికి చెప్పారు. అందులో ఆయన సక్సెస్ అయ్యారు సినిమా కలెక్షన్స్ ద్వారా అంటూ భరద్వాజ సినిమా వెనుక ఇన్న అనేక అంశాలను చెప్పారు.


































