Senior Journalist Bhardwaja : సంక్రాంతి పండగ ఈసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిచ్చు పెట్టింది. ఒకవైపు అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలు విడుదల అవుతుంటే మధ్యలో దిల్ రాజు తన తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ని బరిలోకి దింపుతున్నాడు. తెలుగు సినిమాల సీజన్ టైంలో డబ్బింగ్ సినిమాను పోటీకి పెట్టొద్దంటూ కొంతమంది సినిమా పెద్దలు వాదిస్తున్న సమయంలో సురేష్ బాబు మీడియా ముందు మాట్లాడిన మాటలు మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చాయి. ఇక ఈ విషయంలో తప్పెవరిది, నష్టం ఎవరికి అనే పలు అంశాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు తెలిపారు.

పాన్ ఇండియా అంటూ వెళ్తున్న వేళ డబ్బింగ్ సినిమాను ఆపడమేంటి…
మన సినిమా పక్క రాష్ట్రంలో బాగా ఆడాలని అనుకుంటున్నపుడు పర భాషా చిత్రంను అడ్డుకోవడం ఏమిటి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. సురేష్ బాబు మాట్లాడిన అంశం కూడా దాదాపు ఇలానే ఉంది. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం అవుతున్నపుడు ఇతర భాషా చిత్రాలను కూడా మన లోకల్ మార్కెట్ లోకి ఆహ్వానించాల్సిందే అంటూ చెప్పారు.

ఓటిటి వచ్చాక లోకల్ మార్కెట్ చెరిగిపోయి ప్రపంచం మార్కెట్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పారు. మన హీరోలు ఇకపై లోకల్ మార్కెట్ లో సినిమాలను చేయరు, పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను ప్లాన్ చేస్తారు. ఇక్కడ రెండు రకాల హీరోలు తయారవ్వుతారు. పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ అలానే లోకల్ మార్కెట్ ను టార్గెట్ చేసే హీరోలు, ఇలా నెక్స్ట్ ఇండస్ట్రీ ఉండబోతోంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.



























