Connect with us

Featured

Senior journalist Bhardwaja : సంపూర్ణ రామాయణం మీరు చెయాల్సిన సినిమా నేను చేసి తప్పు చేసానా?? శోభన్ బాబు బాధపడుతుంటే ఎన్టీఆర్ ఏం చేసారంటే : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Published

on

Senior journalist Bhardwaja : తెలుగు ప్రజలకు రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ తరువాతే ఇంకెవరైనా. నిజంగా దేవుళ్ళు కూడా అంత అందంగా ఉంటారో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ ని రాముడిగా కృష్ణుడిగా చూస్తే మాత్రం ఈయనే దేవుడు అనేలా ఉంటారు. అందుకే ఆయన వేసిన ఏ పౌరాణికమైనా సూపర్ హిట్ గా నిలిచాయి. రాముడంటే ఎన్టీఆర్ అనే భావనలో ఉన్న తరుణంలో ముళ్ళపూడి బాపు, రమణలు రాముడిగా శోభన్ బాబు ని చూపించి ఆ రోజుల్లో సాహసం చేసారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ ను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషంచారు.

మొదటి రెండు రోజులు వసూళ్లు లేవు…

ముళ్ళపూడి బాపు, వెంకట రమణ ఇద్దరూ రాముడి మార్గంలో నడిచే భక్తులు. ఈ విషయం వారి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ప్రతి సినిమాలోనూ రామాయణ ప్రభావం వారి మీద ఉంటుంది. అలా వీరిద్దరూ ‘సంపూర్ణ రామాయణం’ తీయాలని అనుకున్నపుడు రాజమండ్రి కి చెందిన విడమర్తి మూర్తి గారు పరిచయమై ఆయన కూడా రామాయణం మీద సినిమా నిర్మించాలని అనుకోవడం, ముగ్గురూ కలవడంతో సినిమా చేయాలని ఎక్కడి నుండి ఎంత వరకు రామాయణం సినిమాలో చూపించాలని చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక అదే సమయంలో హీరోగా రాముడి పాత్రకు శోభన్ బాబు ను తీసుకోవాలని అనుకున్నాక ఎన్టీఆర్ కూడా సంపూర్ణ రామాయణం సినిమా తీయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. సముద్రల గారి స్క్రిప్ట్ ఆయనతో ఉందని తెలిసి ఆయనను కలవడానిక వెళ్లారు. ఆయనతో మాట్లాడుతూ విషయం చెప్పగా నేను రెండు నెలలు బిజీగా ఉంటాను అని చెప్పగా రాముడిగా మీరు కాదు శోభన్ బాబు అని చెప్పారట. మరి నా వద్దకు ఎందుకు వచ్చారు అని అడిగితే మీ దగ్గర సపూర్ణ రామాయణం స్క్రిప్ట్ ఉంది అన్నారు, మీరు మేము ఒకేసారి తీయడం ఇద్దరికీ నష్టమే అందుకే అడుగుదామని, అలాగే మీరు కాకుండా వేరే వాళ్ళతో రాముడి వేషం వేయిస్తున్నామని మీకు స్వయంగా వచ్చి చెప్పాలని ఇలా వచ్చామని చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించి చేయండి, నా స్క్రిప్ట్ లో మార్పులు ఉన్నాయి ఇపుడే తీయాలని అనుకోవడం లేదు అని చెప్పారట.

Advertisement

అలా బాపు రమణల సంపూర్ణ రామాయణం సినిమా పూర్తయ్యాక విడుదల అయింది. చూస్తే మొదటి రెండు రోజులు సినిమాకు జనం లేరు, దీంతో భయపడిన శోభన్ బాబు ఎన్టీఆర్ వద్దకువెళ్లి సాహసం చేశాను మొదట చేయనని చెప్పినా చివరికి రిస్క్ చేశాను సినిమా పోయింది, మీరు చేయాల్సిన పాత్ర నేను చేసాను అంటూ బాధపడగా ఎన్టీఆర్ ఓదార్చరట. సినిమా కొత్త వాళ్ళు తీశారు జనాలలో మౌత్ పబ్లిసిటీ రావడానికి సమయం పడుతుంది. బాపు రమణ లు సినిమా బాగానే తీశారు. నువ్వు మొదటిసారి పూర్తి స్థాయిలో రాముడి వేషం వేశావు ఇంకా నాలుగు రోజులు వేచి చూడు సినిమా జనాలకు నచ్చుతుంది అని చెప్పి పంపారట. ఆయన చెప్పిన విధంగానే సినిమా మెల్లగా జనాలకు నచ్చి శతదినోత్సవం జరుపుకుంది. ఇక రామారావు గారు శోభన్ బాబు గారిని ఓదార్చడం బాపు గారు ఆయన పుస్తకం ‘కోతికొమ్మచ్చి’లో పాత రాముడు కొత్త రాముడిని ఓదార్చాడు అని రాసుకున్నారట.

Continue Reading
Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!