Senior journalist Bhardwaja : మద్రాస్ నుండి హైదరాబాద్ కు టాలీవుడ్ తరలింపు 1990 లో మొదలైంది. మొదటగా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు హైదరాబాద్ కు వచ్చేసారు. ఇక సినిమా స్టూడియోల నిర్మాణం హైదరాబాద్ లో మొదలయింది. అయితే పూర్తి స్థాయి తరలింపు 1993 ఆ ప్రాంతంలో జరిగింది. అయితే మద్రాస్ నుండి హైదరాబాద్ ఒకేసారి 200 మందికి పైగా ఆర్టిస్టులు విమాన మార్గం ద్వారా బయలుదేరారు. అయితే ఆ విమానం ప్రమాదానికి గురైతే అందులో ఉన్న ఆర్టిస్టులంతా ఒక్కసారిగా ప్రాణభయంతో గుండెలు అరచేత పట్టుకుని కూర్చున్నారు. ఇప్పటికీ ఆ రోజును గుర్తు చేస్తే టాలీవుడ్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు.

చిరంజీవి ఏడ్చేశారు… బాలయ్య ఆ పని చేశారు…
మద్రాస్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఆనాడు చిరంజీవి, ఆయన కూతురు శ్రీజ, బాలకృష్ణ ఆయన కుటుంబం, అల్లు రామలింగయ్య గారు, బ్రహ్మానందం, విజయ శాంతి వంటి దిగ్గజ నటులు మొదలు దాదాపు 250 మంది వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఇందన సమస్య రావడంతో ఫైట్ ను ఫారెస్ట్ లో ల్యాండ్ చేసాడు పైలట్ కానీ విమానం కూలిపోతుంది అనే భయంలో చాలా మంది ఏడ్చేశారు. ఇక విమానంను పైలట్ భల్ల ఫారెస్ట్ లో ల్యాండ్ చేసి అందరినీ సేవ్ చేసాడు. ఇక అందరూ అక్కడ దిగాక చిరంజీవి గారు అల్లు రామలింగయ్య ను హత్తుకుని ఒక్క సారిగా ఏడ్చేసారట. అయితే బాలకృష్ణ మాత్రం అక్కడ దిగుతున్న ఆర్థిస్టులకు దిగడానికి సహాయం చేస్తూ చంటి పిల్లలను దించుకుంటూ సహాయం చేశారు.

ఇక ఈ విషయంలో గురించి భరద్వాజ గారు ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి గారు ఎమోషన్ ని దాచలేక పోయారు. అయితే ఈ విషయాన్ని అప్పటి కొంతమంది మంది చిరంజీవి చాలా బేలా మనిషి పిరికివాడు అంటూ చిత్రికరించారు. కానీ అది తప్పు ఒక ప్రమాదం నుండి బయటపడి మళ్ళీ పునర్జన్మ లాగా భావిస్తున్నపుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎదురుపడితే ఏడ్చకుండా ఉండగలమా అదే ఆయన చేసారు. ఇక బాలకృష్ణ ఆ ఎమోషన్ ను పని వైపుకు మళ్ళించారు. అందరినీ ఫ్లైట్ నుండి దించడానికి అక్కడున్న సిబ్బందికి సహాయం చేసి ఆ సిట్యుయేషన్ ను హ్యాండిల్ చేసారు. అది జరిగిన మరుసటి రోజున పైలట్ భల్ల కి సన్మానం చేసారు చిరంజీవి, బాలకృష్ణ గారు. అయితే వివిధ కారణాలతో భల్ల ను సస్పెండ్ చేశారు ఆయన పై అధికారులు.



























