Senior Journalist Imandhi Ramarao : లెజెండరీ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15 న ఉదయం అవయవాలు పనిచేయకపోవడం వల్ల అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ గారి భార్య ఇందిర గారు మరణించి నెలలు గడవక ముందే కృష్ణ గారు మరణించడంతో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలమూకున్నాయి. కృష్ణ గారి మరణంతో ఒక తరం ఇండస్ట్రీలో వెళ్లిపోయినట్లయింది. ఇక వారి కుటుంబంలో మహేష్ ఒంటరివాడయ్యడు అంటూ అందరూ సానుభూతి చూపిస్తున్నా ఈ సమయంలో కృష్ణ గారి ఆస్తులు ఎవరికి చెందుతాయి, అందులో నరేష్ కి కూడా వాటా ఉంటుందా అనే అనుమానాలు బయలుదేరాయి. అసలు కృష్ణ గారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

అస్థి ఎవరికి.. మహేష్ బాబు, నరేష్ లలో ఎవరికి…
తన నటనా ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో సినిమాలను నటించారు. సొంతంగా సినిమాలను నిర్మించారు. కొత్త ట్రెండ్ ను టాలీవుడ్ కి పరిచయం చేసిన ఆంధ్ర జేమ్స్ బాండ్. అయితే మిగిలిన హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాగా ఆస్తులను ఎక్కువగా సంపాదించుకోలేదు అంటూ ఇమంది రామారావు గారు అభిప్రాయపడ్డారు. ఆయన రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం పట్టుబట్టేవారు కాదు, అందుకే ఆయన నిర్మాతల హీరో అయ్యారు. ఆయన చాలా సినిమాలకు పూచికత్తుగా ఉండటం వల్ల నష్టాలను చూడటం అప్పులను కూడా పొగేసుకున్నారు.

ఇక విజయనిర్మల గారి హ్యాండోవర్ లో కొంత ఆస్తులను ఉంచారు. విజయనిర్మల గారు విజయ గార్డెన్స్, ఇల్లు తన పేరు మీద పెట్టుకుని వాటిని మనవడు నవీన్, కొడుకు నరేష్ కి ఇచ్చారు. అయితే స్టూడియో మాత్రమే కృష్ణ గారికి ఉన్న అస్థి అంటూ ఇమంది గారు అభిప్రాయ పడ్డారు. ఇక కృష్ణ గారికి పెద్దగా ఆస్తులేమీ లేకపోవడం వల్ల మహేష్ బాబు హీరో అయ్యాక అప్పులను చాలా వరకు తీర్చాడు, మహేష్ సొంతంగా ఆస్తులను కూడబెట్టుకున్నాడు కాబట్టి కృష్ణ గారికి ఉన్న ఆస్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ నరేష్ తో ఎటువంటి బంధుత్వం లేకపోయినా ఇద్దరూ కలిసి పెరగడం వల్ల ఆయనకేమైనా ఆస్థి కృష్ణ గారు వీలునామా లో రాసి ఉంటే అందులో మహేష్ అభ్యంతరం చెప్పకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.

































