Senior Journalist Imandhi Ramarao : జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ లో కమెడియన్ గా వచ్చిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. అలా ఫేమస్ అయి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెర పవర్ స్టార్ అంటూ ఫుల్ ఫాలోయింగ్ తో ఉన్న సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి బయటికి వచ్చేసాడు. జబర్దస్త్, ఢీ, అలాగే శ్రీ దేవి డ్రామా కంపెనీ ఇలా అన్నింటిలోనూ కనిపించే సుధీర్ ఆ ప్రోగ్రామ్స్ మానేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మా టీవీ, జీ తెలుగు ఇలా అన్నింటిలోనూ పనిచేసిన సుధీర్ మళ్ళీ గ్యాప్ తరుబాధ శ్రీ దేవి డ్రామా కంపెనీ లో కనిపించాడు. మళ్ళీ ఇందులో కంటిన్యూ అవుతాడో లేక వెళ్ళిపోతాడో, ఇక సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్ వీటి మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు మాట్లాడారు.

రష్మీ, సుధీర్ దగ్గర మాట తీసుకుంది…
జబర్దస్త్ లో సుధీర్, రష్మీ ల మధ్య ఉన్న కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే అదంతా కేవలం ప్రోగ్రామ్ రేటింగ్స్ కోసం మాత్రమే అంటూ మేము మంచి స్నేహితులం అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఇంకా అభిమానులు మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చెసుకుంటే బాగుండు అంటూ అనుకుంటున్నారు.

ఈ ఇష్యూ గురించి ఇమంది రామారావు మాట్లాడుతూ రష్మీ, సుధీర్ వద్ధ యాంకర్ గా ఇక నువ్వు చేయద్దని మాట తీసుకోవడం వల్ల ఆ మాటకోసం సుధీర్ ఈటీవీ వదిలి తప్పు చేశాడంటూ అభిప్రాయపడ్డారు. బయటికి వెళ్ళాక పరిస్థితి అర్ధమైన సుధీర్ మళ్ళీ ఈటీవీ గూటికే చేరాడు అంటూ చెప్పారు. రష్మీతో అంత క్లోజ్ బంధం ఉన్నా తనని హీరోయిన్ గా ఎందుకు సినిమాలో తీసుకోలేదు, అలాగే రష్మీ కూడా ఊరికే ఏ పనీ చేయదు అది సుధీర్ సినిమా ప్రొమోషన్స్ అయినా సరే రెమ్యూనరేషన్ కరెక్ట్ గా ఇస్తేనే వస్తుంది అంటూ చెప్పారు.



























