NTR : సినీ కళామతల్లి ఎక్కడో పుట్టిన ఎందరో కళాకారుల్ని తన కడుపులో పెట్టుకొని చూసుకునే బంగారుతల్లి ఆ తల్లి నీడలో పెరిగి అందనంత ఆకాశానికి ఎదిగి, పేరు ప్రతిష్టలతో తరగని ఖ్యాతితో, విరగని కీర్తితో అభిమానుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన సినీ కళాకారులు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. విధి ఆడే వింత నాటకంలో పావులుగా మారే వారు కొందరైతే,ఆర్థిక సుడిగుండాల తో నిత్య పోరాటం చేసేవారు మరికొందరు.

నాటి మిస్సమ్మ, గుండమ్మ, కథ మాయాబజార్, శ్రీ కృష్ణ అర్జున యుద్ధం, సత్యం శివం, చాణక్య చంద్రగుప్త మొదలగు సినిమాలలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాంటి భేషజం లేకుండా నటించారు. ఆ తర్వాత పద్మాలయ సంస్థలో తనకు నటించాలని ఉందని ఎన్టీఆర్ అడిగినప్పుడు ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతి తరం వారు కూడా ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపారు.

కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఎన్టీ రామారావు రాజకీయరంగంలోకి అడుగుపెట్టారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఒకసారి పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత తిరిగి 1989లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ పై కొన్ని వ్యంగ్య చిత్రాలు విడుదలయ్యాయి.

అలా విడుదలైన గండిపేట రహస్యం, రాజకీయ చదరంగం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి రిక్షావాలా… ఈ సినిమాల అనంతరం దర్శకురాలు విజయనిర్మల ఓ ఫంక్షన్ లో కనబడితే అందరి ముందు ఏవమ్మా నా మీద తీయడానికి ఇంకేమైనా మిగిలి ఉందా… ఇంతేనా అని ఎన్టీఆర్ నవ్వుతు అడిగారట..పెద్దాయన సరదాగా తీసుకున్నారేగాని ఏనాడు అంతా సీరియస్ గా తీసుకోలేదు.



























