Senior producer Natti kumar : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో 45 నిమిషాల పాటు మళ్ళీ గుండె కొట్టుకునేలా కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడినుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. ఇక ఆయన విషయంలో అసలు ఏం జరుగుతోంది అనే వివరాలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది…
నట్టి కుమార్ మాట్లాడుతూ తారకరత్న ను మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలించారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని ఆయన బెంగళూరు లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన మొదట గుండె కొట్టుకోవడం ఆగి పోయినపుడు బాలకృష్ణ గారు గట్టిగా మాట్లాడించారని, అది మృత్యుంజయ మంత్రం చదివారో లేక మాట్లాడించారో తెలియదు కానీ ఆయన అలా మాట్లాడించాకే మళ్ళీ తారకరత్న లో చలనం వచ్చింది అని చెప్పారు.

ప్రస్తుతం చికిత్స కు స్పందిస్తున్నా ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది అంటూ నట్టి కుమార్ తెలిపారు. బ్రెయిన్ కి ఏంఆర్ఐ స్కాన్ తీసి అసలు బ్రెయిన్ ఎంత పాడైంది అని తెలిసిన తరువాత చికిత్స అందిస్తారని చెప్తూ అయితే తారక రత్న ఈ గండం నుండి బయటపడతాడు అంటూ తెలిపారు. తన తాత నాన్నమ్మల ఆశీస్సులు ఎపుడూ ఉంటాయి కాబట్టి కోలుకుని తిరిగి వస్తాడు అంటూ తెలిపారు.































