బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆదివారంతో 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు షారుఖ్ ఖాన్. ‘సర్కస్ అండ్ ఫౌజీ’ అనే టీవీ షో ద్వారా కింగ్ ఖాన్ నటనపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టడం జరిగింది. 1992 లో ‘దివానా’ అనే చిత్రంతో బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు షారుఖ్ ఖాన్. అందులో రిషి కపూర్, దివ్య భారతి స్టార్ యాక్టర్స్ కూడా నటించారు.

ఆ తర్వాత షారుక్ తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.. తన కష్టంతోనే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు షారుక్.. బాలీవుడ్ లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక మైన పేజీ ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం విజయాలలో కాస్త వెనుకపడినా త్వరలో ఒక అద్బుతమైన విజయంతో ఇదివరకటి షారుఖ్ ను మళ్లి చూడగలమని ఆశిద్దాం..




























